నెల్లూరు: ఈనెల 18 వ తేదీ నుంచి ప్రారంభమవుతున్న సార్వత్రిక ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో ఎన్నికల సంఘం నిర్దేశించిన అన్ని పత్రాలను సమర్పించాలని నెల్లూరు సిటీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి వికాస్ మర్మత్, ఐ.ఏ.యస్., రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్.ఓ మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రతి ఒక్క అభ్యర్థి తప్పనిసరిగా పాటించాలని, నామినేషన్ ప్రక్రియలో అనుసరించాల్సిన నిబంధనలను కచ్చితంగా పాటించాలని వివరించారు.ఎన్నికల జమా ఖర్చుల అకౌంటింగ్ ను ప్రతి ఒక్క అభ్యర్థి పారదర్శకంగా రికార్డు చేసుకుని సమర్పించాలని సూచించారు. అనంతరం ప్రతినిధులు అడిగిన వివిధ సందేహాలను నివృత్తి చేశారు. ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…
This website uses cookies.