AMARAVATHI

ఓటర్లకు ఉచిత వారాలు ప్రకటించడంపై తీవ్రంగా స్పందించిన సుప్రీం

అమరావతి: దేశంలో ఎన్నికలు వస్తున్నాయి అంటే రాజకీయ పార్టీలు తమ స్వంత నిధులతో ఓటర్లకు పథకాలు అమలు చేస్తున్నట్లు భ్రమింప చేస్తూ అనేక ఉచిత వరాలు ప్రకటిస్తున్నాయి..ఓటర్లకు వరాలు ప్రకటించడంపై గతంలోనే సుప్రీం కోర్టు ఎన్నికల కమీషన్ వివరణ కోరింది..ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు శుక్రవారంనాడు కీలక నిర్ణయం తీసుకుంది..అసెంబ్లీ ఎన్నికలకు 6 నెలల ముందు పన్ను చెల్లింపుదారుల సొమ్ములతో ఉచితాలను పంచిపెడుతున్నరంటూ భట్టూలాల్ జైన్ అనే వ్యక్తి ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలైన చేశారు..ఈ వ్యాజ్యంపై సమాధానం కోరుతూ కేంద్రం, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాలతో పాటు భారత ఎన్నికల సంఘం,, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు,సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు జెబి పార్దివాలా కూడిన ధర్మాసనం నోటీసులు పంపింది.. మధ్యప్రదేశ్, రాజస్థాన్ ప్రభుత్వాలు అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఓటర్లను ఆకట్టుకునేందుకు పన్ను చెల్లింపుదారుల సొమ్ములను దుర్వినియోగం చేస్తున్నాయంటూ పిటీషనర్ ఆరోపించారు.. ”ఎన్నికలకు ముందు ప్రభుత్వం ఉచితం పేరుతో డబ్బులు పంచడం కంటే ఆరాచకం మరొకటి లేదు,, ఇది ప్రతిసారి జరుగుతోంది..అంతిమంగా పన్నుచెల్లింపుదారులపై ఆ భారం పడుతోంది” అని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోర్టులో తన వాదన వినిపించారు.. దీంతో ధర్మాసనం నోటీసులు జారీ చేస్తూ, నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు, ఈసీని ఆదేశించింది.

Spread the love
venkat seelam

Recent Posts

ప్రమాదంకు గురైన ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్నహెలికాప్టర్ ?

అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…

12 hours ago

దక్షిణ బంగాళాఖాతంను తాకిన నైరుతి రుతుపవనాలు

రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…

17 hours ago

ఈనెల 22న రాష్ట్ర గవర్నర్‌ అబ్ధుల్‌ నజీర్‌ జిల్లా పర్యటన

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎం హరినారాయణన్‌…

1 day ago

తిరుపతి,అనంతపురం, పల్నాడు జిల్లాలకు కొత్త కలెక్టర్,ఎస్పీలు

FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…

2 days ago

ఖాళీ బాటిల్, క్యానులలో పెట్రోల్ అమ్మకాలపై నిషేధం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌‌‌లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…

2 days ago

రణరంగాన్ని తలపించిన తైవాన్ పార్లమెంట్

అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…

2 days ago

This website uses cookies.