AMARAVATHI

పీ.ఎం ఆవాజ్ యోజన ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకొండి-ఆదాల

జిల్లా అభివృద్ది సమన్వయ కమిటీ..

నెల్లూరు: కేంద్ర,, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అమలు అవుతున్న సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాల ఫలాలు ప్రజలకు సమగ్రంగా అందేలా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కృషి చేయాలని నెల్లూరు ఎం.పీ ఆదాల ప్రభాకర్ రెడ్డి కోరారు..శనివారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా అభివృద్ది సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం నెల్లూరు ఎం.పీ అధ్యక్షతన జరిగింది.. సమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ది, వ్యవసాయం, హౌసింగ్, జిల్లా నీటి యాజమాన్య సంస్థ,  స్త్రీ శిశు సంక్షేమ శాఖ, జాతీయ రహదారులు, రైల్వే శాఖల ద్వారా వివిధ కేంద్ర ప్రభుత్వ పధకాలు జిల్లాలో అమలు జరుగుతున్న తీరు, వాటి ప్రగతిని కమిటి సమీక్షించింది.. తొలుత చేపట్టిన జిల్లా గ్రామీణాభివృద్ది శాఖ ద్వారా  అమలు జరుగుచున్న దీన్ దయాళ్ అంతోదయ యోజన,  దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ్ కౌసల్ యోజనా, నేషనల్ సోషల్ అస్సిస్టెన్స్ ప్రోగ్రాం ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను సమీక్షిస్తూ,  దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామ్ కౌసల్ యోజనా,  యువత స్వయం శక్తిగా ఎదిగేందుకు, వారికి ఉపాధి అవకాశాలు మెరుగు పడేందుకు చేపడుతున్న  నైపుణ్య శిక్షణా కార్యక్రమాలు పటిష్టంగా అమలు జరిగేలా చర్యలు  చేపట్టాలని సూచించారు.. ప్రధాన మంత్రి ఆవాజ్ యోజన గ్రామీణ,,అర్బన్ క్రింద మంజూరైన ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని, అలాగే లబ్ధిదారులకు సంబంధించిన పే మెంట్స్ సకాలంలోయి చెల్లించేల చూడాలని ఎం.పీ, హౌసింగ్ అధికారులను ఆదేశించారు.జిల్లాలో జాతీయ ఉపాధి హామీ పధకం కింద అమలు జరుగుచున్న పనులు పారదర్శకంగా, పటిష్టంగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని  డ్వామా పిడిని ఆదేశించారు.

Spread the love
venkat seelam

Recent Posts

ముగ్గురు ఎస్పీలు,కలెక్టర్,12 మంది అధికారులపై తీవ్రంగా స్పందించిన-కేంద్ర ఎన్నికల సంఘం

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…

12 hours ago

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

15 hours ago

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టం భద్రత,కౌంటింగ్ డే రోజున పటిష్ట చర్యలు తీసుకొండి-సీఈసీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…

15 hours ago

అక్రమ ఇసుక తవ్వకాలపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు

రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…

17 hours ago

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

2 days ago

రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలపై తీవ్రంగ స్పందించిన భారత ఎన్నికల సంఘం

సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…

2 days ago

This website uses cookies.