నెల్లూరు: జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీని సమర్థంగా అమలు చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ యం. హరి నారాయణన్ ఆదేశించారు. సోమవారం కలెక్టర్ ఛాంబర్ లో ప్రభుత్వాసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందుతున్న వైనం పై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పధకంను అమలు చేస్తున్నందున, సంబంధిత అధికారులందరూ మనసు పెట్టి పనిచేయాలన్నారు. అర్హత గల రోగులను ఆరోగ్యశ్రీ లో రిజిస్ట్రేషన్లు చేసేందుకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు. ప్రతి రోజు ఆరోగ్యశ్రీ రిజిస్ట్రేషన్లు ఖచ్చితంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి రోజు ఖచ్చితమైన పురోగతి ఉండేలా ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ వ్యక్తిగత శ్రద్దతో పనిచేయాలన్నారు. నెల్లూరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ రిజిస్ట్రేషన్లు పెంచేవిధంగా నిర్ధిష్ట కార్యాచరణతో ప్రణాళికాబద్దంగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ చంద్రశేఖర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా పెంచలయ్య, డి సి హెచ్ ఎస్ రమేష్, జి జి హెచ్ సూపరింటెoడెంట్ డా నరేంద్ర తదితరులు పాల్గొన్నారు.
అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్…
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
This website uses cookies.