AMARAVATHI

ఈస్ట్ ఆఫ్ ఇటాలియన్ లాంగ్వేజ్ గా పేరు పొందిన తేనేలూరు..తెనుగు

అమరావతి: ఇటాలియన్ యాత్రికుడు నికోలో డి కాంటి తెలుగు భాష,,ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని పిలిచారు, తెలుగు పదాలు అతనికి సంగీతాన్ని వినిపించాయి, ఎందుకంటే అవన్నీ ఇటాలియన్‌లో భాషలో వలె అచ్చు ధ్వనితో ముగుస్తాయి కాబట్టి..అలాంటి తేనెలోలుకు తెలుగుదనం గురించి నేడు పట్టించుకునే నాథుడు వున్నాడా?? ఆగష్టు 29వ తేది అంటే పాత తరం వారికి ముందుగా గుర్తు వచ్చేది..వాడుక భాష ఉద్యమానికి ఆద్యులు, బహుముఖ ప్రజ్ఞాశాలి గిడుగు రామ్మూర్తి..అలాంటి మహానీయుడి జయంతి సందర్భంగా నేడు తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం..తెలుగు సాహిత్యాన్ని సరళీకరించి, తెలుగు తీయదనాన్ని సామాన్యుడికి చేరువ చేసేందుకు ఆయన చేసిన కృషి మాటల్లో వర్ణించలేనిది..కొంతలో కొంత ఆయన అందించిన విశిష్ట సేవలకు గుర్తుగా గిడుగు రామ్మూర్తి జయంతినే మాతృ భాషా దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది..తెలుగు వికాసానికి పాటుపడిన వారు ఎవరని అడిగితే వెంటనే గుర్తొచ్చేవారిలో వీరేశలింగం పంతులు, గురజాడ అప్పారావు ఎప్పుడూ ఉంటారు. వారి కంటే  తన స్థాయిలోనే కృషి చేసిన వారు గిడుగు రామ్మూర్తి.

1863, ఆగస్టు 29వ తేదిన అప్పటి మద్రాసు ప్రావిన్సులోని పూర్వపు గంజాం జిల్లాకీ, ఇప్పటి శ్రీకాకుళం జిల్లాకి చెందిన పర్వతాల పేట గ్రామంలో జన్మించిన గిడుగు రామ్మూర్తి,, ఆధునిక తెలుగు భాషానిర్మాతల్లో ప్రముఖుడు.. ఉపాధ్యాయుడు, చరిత్ర, శాసన పరిశోధకుడు, వక్త, విద్యావేత్తగానూ ఆయన మంచి పేరు సాధించారు.

పదవీ విరమణ తరువాత కూడా 1911 నుంచి 1936 దాకా పర్లాకిమిడిలోనే ఉంటూ మొత్తం ఆంధ్రదేశమంతా సంచరిస్తూ భాష, విద్య, శాసన పరిశోధన, చరిత్ర పరిశోధనలకు సంబంధించిన ఎన్నో ఉద్యమాలను గిడుగు రామ్మూర్తి చేపట్టారు. 1936లో బ్రిటిష్ ప్రభుత్వం ఒరిస్సాకు ప్రత్యేక ప్రావిన్సును ఏరాటు చేస్తూ తెలుగు వాళ్ళు అత్యధికంగా ఉన్న పర్లాకిమిడిని కూడా ఒరిస్సా రాష్ట్రంలో కలపడానికి నిర్ణయించారు.ఆ నిర్ణయం పట్ల అసమ్మతి ప్రకటిస్తూ గిడుగు రాజమండ్రి వచ్చేసారు. అప్పటినుంచి ఆయన స్వర్గస్తులయ్యేదాకా నాలుగేళ్ళ పాటు రాజమండ్రిలోనే గడిపారు.

దేశ భాషలందు తెలుగు తెస్స అని భావించే తెలుగు వారు అని చెప్పుకునే మనం,,వాస్తవంలో తెలుగు భాష తియ్యదనం గురించి మన పరిధిలో ఏ మేరకు కృషి చేస్తున్నామో అనే విషయం సింహవలోకనం చేసుకోవాల్సి సమయం ఇది ? తెలుగు మాట్లాడడానికే కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు..ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇంగ్లీష్ మీడియం చదువులు,,తెలుగు ఉనికికే ప్రమాదం దాపురించే పరిస్థితిలు ఏర్పాడాయి..తెలుగు భాష అభివృద్ధి అనేది మన ఇంటి నుంచే మొదలైతేనే,,అది దేశమంతటా వ్యాప్తి చెందుతుంది..అలా ప్రతి ఒక్కరూ అనుకుంటేనే తెలుగు భాషకు గౌరవం అక్కున చేర్చుకున్నట్లు…ఎంత సాధించినా.. ఏం చేసినా… మన మాతృభాషలో ఆమ్మ అనే పదానికి,,పరాయి భాషలో మమ్మీ అనేందుకు ఉన్న తేడా….మరేభాషలోనూ ఉండదు…

Spread the love
venkat seelam

Recent Posts

జగన్ పాలనలో రాష్ట్రం దొంగల రాజ్యం, దోపిడీల రాజ్యంగా మారిపోయింది-షర్మిలా

నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…

2 hours ago

ఆంధ్రప్రదేశ్‌లో గూండాగిరిని అంతం చేసేందుకే పొత్తూ-అమిత్ షా

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా…

5 hours ago

డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డిపై బదలీ వేటు

అమరావతిం ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి,,ఎన్నికల వేళ విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదంటూ ఆయన ఎలక్షన్స్ కమీషన్ బదిలీ వేటు…

5 hours ago

ఉద్యోగుల పోస్టల్‌ బ్యాలెట్‌ కు 8వ తేదీ వరకు ఓటింగ్‌కు అవకాశం- కలెక్టర్‌

నెల్లూరు: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పోలింగ్‌ విధులు కేటాయించబడిన ప్రభుత్వ ఉద్యోగులందరూ పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా తమ…

6 hours ago

భారత వాయుసేనకు చెందిన వాహనంపై ఉగ్రవాదుల దాడులు

అమరావతి: జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…

1 day ago

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్,రాబోయే రోజుల్లో ఈ చట్టం గొప్ప సంస్కరణ అవుతుంది-వైసీపీ అధినేత జగన్

నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…

1 day ago

This website uses cookies.