AMARAVATHI

ఓటర్ల తొలగింపును స్వయంగా పరిశీలించిన కలెక్టర్

నెల్లూరు: ఓటర్ల జాబితా నుండి ఓటు తొలగించిన విషయమై క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితిని పలు మండలాల్లో జిల్లా ఎన్నికల అధికారి,జిల్లా కలెక్టర్ హరినారాయణన్ శుక్రవారం తనిఖీ చేశారు. జిల్లా ఎన్నికల అధికారిగా సర్వేపల్లి నియోజకవర్గంలోని మనుబోలు మండలం చెర్లోపల్లి, గోవిందరాజపురం, జట్ల కొండూరు, కొండూరు సత్రం, వెంకటాచలం మండలం ఇస్కపాలెం తదితర గ్రామాల్లో చనిపోయిన, రెండు ఓట్లు ఉన్న వారి  ఓటు తొలగింపు, వేరే చోటుకు బదిలీ అయిన  ఓటు తొలగించడం పై వాస్తవ పరిస్థితిని వారి ఇంటికి వెళ్లి పరిశీలించారు. చనిపోయారా , ఇక్కడ లేకుండా వేరే ప్రాంతాలకు వెళ్లి పోయారాయని కుటుంబ సభ్యులను, పరిసర ప్రాంతాల వారిని ఆరాతీశారు. ఓటు తొలగించే ముందు వారి కుటుంబ సభ్యులకు తెలియచేశారా లేదా అని  విచారించారు. మాకు తెలియ చేసే మరణించిన వారి ఓటు తొలగించారని కుటుంబ సభ్యులు కలెక్టర్ కు తెలిపారు. ఓటరు జాబితా నుంచి ఓటు తొలగించు విషయమై ర్యాoడం తనిఖీలలో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గంతో పాటు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని పడారు పల్లి, జ్యోతినగర్, గాంధీ నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి పరిశీలించారు.కలెక్టర్ వెంట మనుబోలు, వెంకటాచలం, నెల్లూరు రూరల్ తహసీల్దార్లు శివకృష్ణయ్య, వెంకటేశ్వర్లు, గోపికృష్ణ, బి ఎల్ ఓ లు ,తదితరులు ఉన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

అక్రమ ఇసుక తవ్వకాలపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు

రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…

27 mins ago

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

22 hours ago

రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలపై తీవ్రంగ స్పందించిన భారత ఎన్నికల సంఘం

సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…

24 hours ago

రాష్ట్రంలో రికార్డు స్థాయి నమోదైన పోలింగ్- 81.76 శాతం

అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…

1 day ago

బుద్ది మార్చుకోని ప‌శ్చిమ దేశాలు-ఎన్నికల నిర్వహణపై మనకు పాఠలా-జయశంకర్

అమరావతి: భార‌త్‌లో జ‌రుగుతున్న సార్వత్రిక ఎన్నిక‌ల‌పై ఇటీవ‌ల అమెరికా,, కెన‌డా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్య‌లపై విదేశాంగ మంత్రి…

1 day ago

గుంటూరు జిల్లా వద్ద ఘోర అగ్ని ప్రమాదంకు గురైన ప్రవేట్ ట్రావెల్స్ బస్సు-5 సజీవదహనం

5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్‌…

1 day ago

This website uses cookies.