DISTRICTS

సమాచార హక్కు చట్టం అమలు చేస్తున్నతీరుపై ఆసంతృప్తిని వ్యక్తం చేసిన కమీషనర్

నెల్లూరు: జిల్లాలో సమాచార హక్కు చట్టం అమలు చేస్తున్నతీరుపై రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ బి.వి.రమణకుమార్,అధికారులను నిలతీశారు.శుక్రవారం నగరంలోని జడ్పీ సమావేశ మందిరంలో సమాచార హక్కు చట్టం అమలు తీరుపై కమిషనర్ అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్బంలో అయన మాట్లాడుతూ ఆర్టీఏ యాక్ట్ వచ్చి దాదాపు 17 సంవత్సరాలు అయినప్పటికి,ప్రజలు అడిగిన సమాచారం అందించడంలో అధికారులు ఆలసత్వం వహిస్తున్నరని అభిప్రాయం పరోక్షంగా వ్యక్తం చేశారు.అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సెక్షన్ 4(1బి)లో పొందుపరిచిన 17 అంశాలను తూచా తప్పకుండా అమలు చేయాలన్నారు. దరఖాస్తుల పరిశీలన, నిర్దిష్ట గడువులోగా పరిష్కారానికి జిల్లాస్థాయి ఆర్టీఐ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేయాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. ఈ అవగాహన సదస్సులో  జిల్లా న్యాయ సేవా సంస్థ అధ్యక్షులు, సీనియర్ సివిల్ జడ్జి శ్రీనివాసులు, ASP శ్రీమతి హిమవతి,DRDA PD సాంబశివ రెడ్డి, DM&HO పెంచలయ్య,DPO శ్రీమతి ధనలక్ష్మి, జిల్లా వ్యవసాయ అధికారి సుధాకర్ రాజు, పంచాయతీ రాజ్ SE శివారెడ్డి, నెల్లూరు, కావలి RDOలు మలోల,శీనానాయక్, సమాచార శాఖ, సోషల్ వెల్ఫేర్ DDలు శ్రీమతి రమాదేవి,వెంకటేశ్వర ప్రసాద్, తాసిల్దార్లు, MPDOలు, పౌర సమాచార అధికారులు,RTA దరఖాస్తుదారులు పాల్గొన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

ప్రమాదంకు గురైన ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్నహెలికాప్టర్ ?

అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…

17 hours ago

దక్షిణ బంగాళాఖాతంను తాకిన నైరుతి రుతుపవనాలు

రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…

21 hours ago

ఈనెల 22న రాష్ట్ర గవర్నర్‌ అబ్ధుల్‌ నజీర్‌ జిల్లా పర్యటన

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎం హరినారాయణన్‌…

2 days ago

తిరుపతి,అనంతపురం, పల్నాడు జిల్లాలకు కొత్త కలెక్టర్,ఎస్పీలు

FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…

2 days ago

ఖాళీ బాటిల్, క్యానులలో పెట్రోల్ అమ్మకాలపై నిషేధం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌‌‌లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…

2 days ago

రణరంగాన్ని తలపించిన తైవాన్ పార్లమెంట్

అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…

2 days ago

This website uses cookies.