AMARAVATHI

కుప్పకూలిపోయిన రష్యా లూనా-25 ల్యాండర్

అమరావతి: భారతదేశం కంటే ముందుగా చంద్రుని దక్షిణ ధ్రువాన్ని చేరుకునేందుకు ఆగష్టు 11వ తేదిన రష్యా ప్రయోగించిన లూనా-25 ల్యాండర్ సురక్షితంగా ల్యాండ్ కాలేకపోయిందని రష్యా దేశ స్పేస్ ఏజెన్సీ రోస్కోస్మోస్ ప్రకటించింది..చంద్రునికి దగ్గరలో చేరుకున్నప్పటి సురక్షితంగా ల్యాండ్ కాలేకపోయిందని,, లూనా-25తో కమ్యూనికేషన్స్ అదివారం మధ్యాహ్నం 2.57 గంటలకు పూర్తిగా తెగిపోయాయని,,దాని నుంచి ఎలాంటి సమాచారం అందడం లేదని వెల్లడించింది..కొన్ని గంటల ముందు లూనా-25 ల్యాండర్ లో సమస్యలు తలెత్తాయని తెలిపింది..రాకెట్లోని ఆటోమేటిక్ స్టేషన్ లో అత్యవసర పరిస్థితి తలెత్తిందని రష్యా పేర్కొంది..ఆ తరువాత కొన్ని గంటల వ్యవధిలోనే తమ ప్రయోగం విఫలమైందని ప్రకటించింది.వీలైనంత వరకు లూనా-25 ల్యాండర్ తో కమ్యూనికేషన్స్ కోసం ప్రయత్నిస్తామని వెల్లడించింది..గతంలో చంద్రయాన్-2 క్రాష్ ల్యాండ్ ను దృష్టిలో వుంచుకుని,,భారత్ ప్రయోగించిన చంద్రయాన్-3 ఈ నెల 23న చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టనుంది..ఈ సారి ఎటువంటి సమస్యలూ తలెత్తకుండా ఇస్రో అనేక మార్పులు చేసింది.. అదివారం వేకువజామున చంద్రయాన్-3 మధ్య రెండో,,చివరి డీ-బూస్టింగ్ ను విజయవతంగా పూర్తిచేసినట్లు ఇస్రో ప్రకటన విడుదల చేసింది..చంద్రుడికి చేరువైన విక్రమ్ ల్యాండర్,, ల్యాండింగ్ కావడమే మిగిలి వుంది..రష్యా ప్రయోగించిన లూనా-25 విఫలమైన వేళ ప్రపంచం దృష్టి చంద్రయాన్-3 పైనే వుంది.

Spread the love
venkat seelam

Recent Posts

ప్రమాదంకు గురైన ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్నహెలికాప్టర్ ?

అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…

13 hours ago

దక్షిణ బంగాళాఖాతంను తాకిన నైరుతి రుతుపవనాలు

రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…

17 hours ago

ఈనెల 22న రాష్ట్ర గవర్నర్‌ అబ్ధుల్‌ నజీర్‌ జిల్లా పర్యటన

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎం హరినారాయణన్‌…

1 day ago

తిరుపతి,అనంతపురం, పల్నాడు జిల్లాలకు కొత్త కలెక్టర్,ఎస్పీలు

FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…

2 days ago

ఖాళీ బాటిల్, క్యానులలో పెట్రోల్ అమ్మకాలపై నిషేధం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌‌‌లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…

2 days ago

రణరంగాన్ని తలపించిన తైవాన్ పార్లమెంట్

అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…

2 days ago

This website uses cookies.