నెల్లూరు: కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన “స్వచ్ఛతా హీ సేవా” కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ 1వ తేదీ చేపడుతున్న శ్రమదానంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని నగర పాలక సంస్థ కమిషనర్ వికాస్ మర్మత్ శనివారం కోరారు. పరిసరాల పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తూ వ్యర్ధాల నుంచి పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని సూచించారు. పరిశుభ్రత ద్వారా అభివృద్ధి అన్న ఆశయంతో నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజనుల్లో వీధులను చిమ్మడం, డ్రైను కాలువల్లో పూడికతీత, సింగిల్ యూస్ ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలను చేపట్టాలని తెలిపారు. గాంధీ మహాత్మునికి నివాళిగా “స్వచ్ఛ హీ సేవా” లో భాగంగా ఆదివారం ఉదయం 10 గంటలకు స్థానిక గణేష్ ఘాట్, ఇరుకళల పరమేశ్వరి గుడి దగ్గర, నెల్లూరు బ్యారేజ్ తిక్కన పార్కు పరిసర ప్రాంతాల్లో నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో శ్రమదానం నిర్వహిస్తున్నట్లు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగర పాలక సంస్థ గౌరవ మేయర్ శ్రీమతి స్రవంతి, డిప్యూటీ మేయర్లు,కార్పొరేటర్లు, కో ఆప్షన్ మెంబర్లు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొంటున్నారని,,కార్పొరేషన్ లోని అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొనాలని కమిషనర్ కోరారు.
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు..ఈ పిటిషన్పై జస్టిస్…
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
This website uses cookies.