నెల్లూరు: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి, స్వాతంత్ర్య సమరయోధులు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని వారు చూపిన బాటలో భావితరాలు పయనించాలని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు పేర్కొన్నారు.ఆంధ్రకేసరి జయంతి సందర్భంగా మంగళవారం కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణంలో ప్రకాశం పంతులు చిత్రపటానికి కలెక్టర్, పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా, స్వాతంత్ర్య సమరయోధులుగా ఆయన దేశం కోసం చేసిన త్యాగం, చూపిన ధైర్యం, స్థైర్యం తలమానికమని, ఆనాటి సైమన్ కమిషన్ కు ఎదురు నిలబడి ముందు నన్ను కాల్చండి అంటూ తన గుండెను చూపిన ఆంధ్ర కేసరి భారతీయుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు.ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా స్వాతంత్ర్య సమరయోధులను స్మరించుకుంటూ జిల్లా వ్యాప్తంగా అనేక కార్యక్రమాలను జరుపుకొని దేశ వ్యాప్తంగా జిల్లాకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు.ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్.కూర్మనాథ్, తదితరులు పాల్గొన్నారు.
అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…
అమరావతి: మే 13వ తేదిన ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల రోజు, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల బాధ్యులు అయిన…
దొరికిన ఎమ్మేల్యే కాకాణి కారు ? అమరావతి: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో రేవ్పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని…
ఓల్డ్ మోడల్ హెలికాప్టర్ వల్లే ప్రమాదం? అమరావతి: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) అదివారం హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందారు.. ఆయన…
అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
This website uses cookies.