గులాంనబీ ఆజాద్ కొత్త పార్టీ..
అమరావతి: 53 సంవత్సరాల నుంచి తాము కాంగ్రెస్ కోసం రక్తం ధారబోశామని,,ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కంప్యూటర్కు, ట్వీట్టర్కు మాత్రమే పరిమితం అయ్యిందని,, తమలాంటి వాళ్ల పార్టీ విడి బయటకు వస్తున్నరంటే,,రాహుల్ యువరాజు లాగా ప్రవర్తిస్తుండడమే కారణమంటూ గులాంనబీఆజాద్(73) మండిపడ్డారు.అదివారం కాంగ్రెస్కు గుడ్బై చెప్పిన గులాంనబీ ఆజాద్, జమ్ములో భారీ రోడ్షో నిర్వహించారు.అనంతరం సైనిక్ కాలనీలో నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ కొత్త పార్టీ పేరు,జెండా జమ్ముకశ్మీర్ ప్రజలే నిర్ణయించాలన్నారు..పార్టీ పేరు హిందుస్తాన్ ను ప్రతిబింబిస్తుందన్నారు.జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు.రాష్ట్రంలో విద్యా,నిరుద్యోగులకు ఉపాధి అవకాశలపై దృష్టి పెడతామన్నారు..గులాంనబీ ఆజాద్ ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకుంటారని,,బీజేపీతో కలిసి కూటమి ఏర్పాటు చేస్తారని ఊహాగానాలు విన్పిస్తున్న నేపధ్యంలో,వాటికి సమాధానం ఇస్తు, ఎట్టి పరిస్థితుల్లో బీజేపీతో పొత్తు ఉండదని ఆజాద్ ప్రకటించారు.నేషనల్ కాన్ఫరెన్స్ లేదా పీడీపీతో పొత్తు ఉంటుందని ప్రచారంపై అయన పెద్దగా స్పందించలేదు. గులాంనబీఆజాద్కు మద్దతుగా దాదాపు 100 మంది కాంగ్రెస్ నేతలు రాజీనామా చేశారు.
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు..ఈ పిటిషన్పై జస్టిస్…
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
This website uses cookies.