అమరావతి: దేశ రాజధాని న్యూఢిల్లీలో వాయుకాలుష్యంకు కారణమైన పంట వ్యర్థాల కాల్చివేతపై సుప్రీమ్ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది..పంట వ్యర్థాలను తగులబెట్టడం అంటే హత్యతో సమానం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.. ఢిల్లీలో వాయుకాలుష్యంపై దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా ధర్మాసనం పై విధంగా స్పందించింది.. పంజాబ్ ప్రభుత్వానికి చీవాట్లు పెడుతూ పంట వ్యర్థాలను తగులబెడుతున్న ఘటనలను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఆపలేకపోతోందని ప్రశ్నించింది.. ఇది ప్రజల జీవితాలకు సంబంధించిన సమస్య…పరస్పర రాజకీయ విమర్శలు,, నిందారోపణలు మాని పరిష్కారంపై దృష్టి పెట్టాలి అంటూ హితవు పలికింది..“బలవంతపు చర్యలు చేపడతారో లేక ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా ప్రత్యామ్నాయ పద్ధతులు అమలు చేస్తారో మాకు తెలియదు,, తక్షణమే ఈ చర్యలకు అడ్డుకట్ట వేయాలి” అంటూ ఆదేశాలు జారీ చేసింది.
వరి గడ్డిని కాల్చడం:- పంజాబ్ లో యంత్రపరికరాల వినియోగం ఎక్కువ. పంట చేతికి వచ్చిన తరువాత యంత్రాల ద్వారానే కోతలు పూర్తి చేస్తారు..యంత్రాల ద్వారా జరిగే వరికోతలో భూమి నుంచి కనీసం మోకాలు ఎత్తు వరకు గడ్డి మిగిలిపోతుంది.. వాటిని తగులబెట్టడం ద్వారా రైతులు, రబీ పంటల సాగు కోసం భూమిని దున్నతారు..ఈ పంట కోత తరువత గడ్డిని కాల్చడంతో,,గడ్డిని నుంచి వచ్చే పొగ, ఢిల్లీలో వాయుకాలుష్యానికి ప్రధాన కారణంగా మారుతోంది..ఇదే సమయంలో ఖరీఫ్ పంట చేతికొచ్చే సమయానికి శీతాకాలం ప్రారంభమై పొగమంచు ఏర్పడుతుంది.. ఇది కాలుష్య కారకాలను భూ ఉపరితల వాతావరణంలోకి వెళ్లకుండా అడ్డుకుంటుంది. దాంతో వాయుకాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయిని దాటి ప్రాణాంతకంగా మారుతోంది.
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
This website uses cookies.