AMARAVATHI

వైసీపీ ఎమ్మెల్యేలు ప్రాణ హానితో భయపడే పరిస్థితులు వచ్చాయి-పవన్ కళ్యాణ్

డీజీపీ బాధ్యత తీసుకోవాలి..

హైదరాబాద్: వెంకటగిరి ఎమ్మేల్యే,మాజీ మంత్రి ఆనం.రామనారాయణరెడ్డి తనకు ప్రాణ హాని వుందని అందోళన చెందట చూస్తూంటే,,రాష్ట్రంలో ప్రతీకార రాజకీయాలు పరాకాష్టకు చేరాయని జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ ఆందోళన వ్యక్తం చేశారు..ఎమ్మెల్యేలు ప్రాణ హానితో భయపడే పరిస్థితులు వచ్చాయని,,ఈ ఈ విషయంలో రాష్ట్ర డీజీపీ బాధ్యత తీసుకోవాలని ఆయన సూచించారు..లేకపోతే రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితిని కేంద్ర హోమ్ శాఖకు లేఖ రాస్తానని హెచ్చరించారు..ప్రజా జృవితంలో సుదీర్ఘ అనుభవం, హుందా రాజకీయాలకు పేరెన్నికెగన్న ఆయన ఆందోళన చెందుతున్నారంటే మిగిలిన ప్రజాప్రతినిధుల పరిస్థితేంటి? శాసన సభ్యులే ప్రాణ హానితో భయపడే పరిస్థితులు వచ్చాయి..మేం నెల్లూరులో ఉన్నప్పటి నుంచి ఆనం కుటుంబంతో పరిచయం ఉంది..ప్రభుత్య వ్యవహార శైలి గురించి, తన నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టకపోవడంపై ఆనం రామనారాయణరెడ్డి తన అభిప్రాయాలు వెల్లడించారు..అయితే దీనిని ప్రభుత్వ పెద్దలు నేరంగా భావిస్తున్నారు..ఆయనకు కేటాయించిన రక్షణ సిబ్బందిని సైతం తగ్గించారు..సొంత ఎమ్మెల్యేలపైనే నిఘాలు, ఫోన్ సంభాషణలు దొంగ చాటుగా వినడం పాలకుల అభద్రతా భావాన్ని తెలుపుతోంది..అధికార పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నేరుగా సీఎం, ఆయన కార్యాలయంపై ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేస్తే బాధ్యత కలిగిన డీజీపీ, హోమ్ శాఖ మంత్రి ఎందుకు మాట్లాడటం లేదు ? రామనారాయణ రెడ్డి చేసిన ప్రాణ హాని ప్రకటన, కోటం శ్రీధర్ రెడ్డి చేసిన ఫోన్ ట్యాపింగ్ వ్యాఖ్యల గురించి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు వివరణ ఇవ్వాలి’ అని పవన్‌ డిమాండ్‌ చేశారు.

Spread the love
venkat seelam

Recent Posts

ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది-ద్వారకా తిరుమలరావు

సాధారణ ఛార్జీలతోనే నడుస్తాయి.. అమరావతి: మే 13న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో APSRTC ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిందని,,మే 8…

3 hours ago

పీఠాపురం చేరుకున్న సురేఖ,రామ్‌ చరణ్-పవన్ కల్యాణ్ ని గెలిపించండి

అమరావతి: మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్, తల్లి సురేఖ పిఠాపురంలో సందడి చేశారు..తొలుత స్థానికంగా ఉండే కుక్కుటేశ్వర స్వామి…

6 hours ago

ఓటరు అసిస్టెంట్‌ బూత్‌ల ఏర్పాటు-మే 13న పోలింగ్‌కు పక్కాగా ఏర్పాట్లు-కలెక్టర్‌

డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌లో ఏర్పాట్లు పరిశీలన.. నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న జిల్లావ్యాప్తంగా జరగనన్ను పోలింగ్‌…

6 hours ago

12 రకాల గుర్తింపు కార్డులతో ఓటుహక్కు వినియోగానికి అవకాశం- కలెక్టర్‌

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్‌ రోజున ఓటరు గుర్తింపుకార్డుతో పాటు 12 రకాల గుర్తింపు…

1 day ago

క్రేజీ వాల్ కు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు

అమరావతి: ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్‌ కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ పలు షరతులు విధించింది.. బెయిల్‌పై…

1 day ago

సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి-కలెక్టర్‌

జిల్లాలో పటిష్ఠ బందోబస్తు-ఎస్పీ నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు జిల్లాలో పక్కాగా ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా ఎన్నికల అధికారి,…

2 days ago

This website uses cookies.