HYDERABAD

పేదలను దోచుకునే వాళ్లను వదిలిపెట్టేది లేదు-ప్రధాని మోదీ

హైదరాబాద్: పేదలను దోచుకునే వాళ్లను వదిలిపెట్టేది లేదని, పేదల ఎదుగుదలకు అవినీతే అడ్డుగా వున్నదని,క్కడ అన్యాయం జరిగితే అక్కడ బీజేపీ మరింత బలపడుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు.శనివారం ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నంలో పలు అభివృద్ది పనులు ప్రారంభించిన అనంతరం హైదరాబాద్ కు చేరుకున్న ప్రధాని బేగంపేట విమానశ్రయాంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కార్యకర్తలను ఉద్దేశించిన ప్రసంగిస్తూ…రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కేసులు పెడుతున్నా బీజేపీ కార్యకర్తలు భయపడడం లేదని, అణిచివేతకు వ్యతిరేకంగా రాష్ట్రంలో పోరాటం కొనసాగుతోందని చెప్పారు. పసుపు రైతులను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో అవినీతి ప్రభుత్వం పోయి బీజేపీ ప్రభుత్వం రావాలని ఆకాంక్షించారు. మునుగోడు ప్రజలు ఉప ఎన్నిక సందర్భంగా బీజేపీకి ఒక భరోసా ఇచ్చారని అన్నారు. ఒక్క అసెంబ్లీ సీటు కోసం రాష్ట్ర  ప్రభుత్వం మెత్తం మునుగోడులో మకాం వేసిందంటూ సెటైర్లు వేశారు. కమ్యూనిస్టులు అభివృద్ధి నిరోధకులు అని ఆరోపించారు. మరోవైపు మునుగోడు ఉప ఎన్నికలో రాష్ట్ర బీజేపీ పోరాటాన్ని ప్రశంసించారు. కొందరు తనను తిట్టడం కోసం డిక్షనరీలను వెతుకుంటున్నారని ప్రధాని మోడీ వ్యంగ్యంగా వ్యాఖ్యనించారు.తనను, బీజేపీని తిట్టినా భరిస్తాను కానీచ తెలంగాణ ప్రజలకు కష్టం వస్తే మాత్రం సహించనని చెప్పారు. 22 ఏళ్లుగా తాను తిట్లు తింటూనే ఉన్నానని, ఆ తిట్లే తనకు బలంగా మారుతున్నాయని చెప్పారు. కొంతమంది నిరాశవాదులు అదే పనిగా తిడుతుంటారని, రాష్ట్ర పాలకులకు తనను తిట్టడమే తెలుసన్నారు. తనను, బీజేపీని తిడితే రాష్ట్ర రైతులకు మేలు జరుగుతుందా..? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి,,, మంత్రులను కేబినెట్ లోకి తీసుకోవడం,,, వారిని మంత్రి వర్గం నుంచి తీసేవేయడం కూడా మూఢవిశ్వాసాలతో చేస్తున్నారని మోడీ ఎద్దేవా చేశారు. 

Spread the love
venkat seelam

Recent Posts

వైభ‌వంగా శ్రీ సీతా జ‌యంతి

తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామి ఆల‌యంలో శుక్ర‌వారం వైభ‌వంగా సీతా జ‌యంతి ఉత్స‌వం నిర్వ‌హించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…

18 hours ago

స్ట్రాంగ్ రూముల వద్ద ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొండి-ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…

18 hours ago

ఇంటి స్థలం కొనుగొలుపై హైకోర్టుకు జూనియర్ ఎన్టీఆర్‌

హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్‌ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు..ఈ పిటిషన్‌పై జస్టిస్‌…

22 hours ago

ముగ్గురు ఎస్పీలు,కలెక్టర్,12 మంది అధికారులపై తీవ్రంగా స్పందించిన-కేంద్ర ఎన్నికల సంఘం

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…

2 days ago

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

2 days ago

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టం భద్రత,కౌంటింగ్ డే రోజున పటిష్ట చర్యలు తీసుకొండి-సీఈసీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…

2 days ago

This website uses cookies.