DISTRICTS

పట్టభద్రులు,ఉపాధ్యాయ ఎన్నికకు సంబంధించి తుది జాబిత డిశంబరు 30న ప్రచురణ-కలెక్టర్

నెల్లూరు: ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో 76 పోలింగ్ కేంద్రాలను, ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి 36 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు పేర్కొన్నారు.శనివారం కలెక్టరేట్ లోని ఎస్సార్ శంకరన్ హాల్లో ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు పట్టభద్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికల పోలింగ్ కేంద్రాల ముసాయిదా జాబితాలపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అన్ని మౌలిక వసతులు ఉన్నటువంటి కళాశాలలు, పాఠశాలలను పోలింగ్ కేంద్రాలుగా ఎంపిక చేసినట్టుగా తెలిపారు. ప్రతి మండల కేంద్రంలో పోలింగ్ కేంద్రo ను ఏర్పాటు చేసామన్నారు. పట్టభద్రుల ఎన్నికకు సంబంధించి ఆత్మకూరు, బుచ్చి, కొవూరు, పొదలకూరు, ఉదయగిరి, వింజమూరు, కలిగిరి మండలాలలో రెండు పోలింగ్ కేంద్రాలు, అదేవిధంగా కందుకూరు – 4, కావలి – 6, నెల్లూరు అర్బన్ – 9, నెల్లూరు రూరల్ – 19 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ నెల 7వ తేది నాటికి జిల్లాలో పట్టభద్రుల ఎన్నికకు సంబంధించి 1,13,837 మంది, ఉపాధ్యాయ ఎన్నికకు సంబంధించి 7,783 మంది ఓటర్లుగా నమోదుకు దరఖాస్తులు సమర్పించారన్నారు. వాటిని పరిశీలించి ఈ నెల 19వ తేది నాటికి డ్రాఫ్ట్ తయారి పూర్తిచేసి, 23వ తేదిన ఎలక్ట్రోరల్ రోల్స్ జాబితా ప్రచురిస్తామని, వాటిపై అభ్యంతరాలను డిశంబర్ 9 వరకు స్వీకరిస్తామన్నారు. వచ్చిన అభ్యంతరాలను డిశంబర్ 25 నాటికి పరిష్కరించి, తుది జాబితాను డిశంబర్ 30న ప్రచురిస్తామన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

రణరంగాన్ని తలపించిన తైవాన్ పార్లమెంట్

అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…

21 mins ago

వైభ‌వంగా శ్రీ సీతా జ‌యంతి

తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామి ఆల‌యంలో శుక్ర‌వారం వైభ‌వంగా సీతా జ‌యంతి ఉత్స‌వం నిర్వ‌హించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…

20 hours ago

స్ట్రాంగ్ రూముల వద్ద ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొండి-ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…

20 hours ago

ఇంటి స్థలం కొనుగొలుపై హైకోర్టుకు జూనియర్ ఎన్టీఆర్‌

హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్‌ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు..ఈ పిటిషన్‌పై జస్టిస్‌…

1 day ago

ముగ్గురు ఎస్పీలు,కలెక్టర్,12 మంది అధికారులపై తీవ్రంగా స్పందించిన-కేంద్ర ఎన్నికల సంఘం

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…

2 days ago

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

2 days ago

This website uses cookies.