NATIONAL

నేటి భారతదేశం ఇతరదేశాల సమస్యలకు పరిష్కరం చూపిస్తుంది-ప్రధాని మోదీ

అమరావతి: 2004లో విచ్చలవిడిగా మొదలైన అవినితి,,దశాబ్దం కాలం పాటు (2014)  వరకు సాగిందని,,కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉగ్రవాదం రాజ్యమేలిందని ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఆరోపించారు..రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ  రాష్ట్రపతి ప్రసంగం దేశానికి ఆదర్శమన్నారు..ఆదివాసీ సమాజానికి గొప్ప గౌరవం దక్కిందన్నారు..నిన్న సభలో కొంత మంది సభ్యులు ఉత్సాహంగా వ్యాఖ్యలు చేశారన్నారని,,ఓ పెద్ద నాయకుడు రాష్ట్రపతిని విమర్శించారని,పరోక్షంగా రాహుల్ గాంధీని ఉద్దేశించి వ్యంగ్యంగా వ్యాఖ్యనించారు..అలాంటి వ్యాఖ్యలు నేతల మనసులోని ద్వేషాన్ని బయటపెట్టాయన్నారు..ఒకప్పుడు భారతదేశం తన సమస్యల పరిష్కారానికి ఇతరులపై ఆధారపడే పరిస్థితి వుండేదని,, కానీ నేటి భారతదేశం ఇతరదేశాల సమస్యలకు పరిష్కరం చూపిస్తుందని రాష్ట్రపతి  చెప్పారని మోడీ గుర్తు చేశారు.. భారతదేశం ఈలాంటి క్షణం కోసమే  ఎంతో కాలం నుంచి  ఎదురుచూస్తుందని ప్రధాని అన్నారు..దేశంలో అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు తీసుకున్న చర్యలు ఫలితాలను ఇవ్వడం ప్రారంభించాయన్నారు..ఎన్నికలే జీవితం కాదని,,140 కోట్ల ప్రజల సంక్షేమమే తమకు ముఖ్యమన్నారు..కొవిడ్ ను భారత్ సమర్థవంతంగా ఎదుర్కొందని  చెప్పారు..చాలా దేశాలను నిరుద్యోగం, ద్రవ్యోల్భణం వేదిస్తున్నాయని,,ఇలాంటి సమయంలోనూ మనం ప్రపంచలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదిగామన్నారు..నేడు G20 సదస్సును నిర్వహించే స్థాయికి ఎదిగామని,,ఇది కొందరికి కంటగింపు కావొచ్చు కానీ తనకైతే గర్వంగా ఉందని చెప్పారు.. 

ప్రపంచ దేశాలన్నీ ప్రస్తుతం భారతదేశం వైపు చూస్తున్నాయన్న విషయం భారతదేశ యువతకు తెలుసన్నారు.. మొబైళ్ల తయారీలో దేశం రెండో స్థానంలో ఉందని,,డిజిటల్ ఇండియాను చూసి ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోయాయని చెప్పారు..ఇంధన వినియోగంలో దేశం మూడో స్థానంలో ఉందన్నారు.. కామన్ వెల్త్ క్రీడల్లో మన ఆడపిల్లలు అద్భుతంగా రాణిస్తున్నారని కొనియాడారు..స్టార్టప్ లో మనం ప్రపంచంలో మూడో స్థానంలో ఉన్నామన్నారు.. ప్రతి రంగంలో భారత్ చరిత్ర సృష్టిస్తోందన్నారు..ఇవన్నీ చూసిన కొందరు నిరాశవాదులకు నిద్రపట్టడం లేదంటూ ఎద్దేవా చేశారు..2014 నుంచి ఇప్పటి వరకు  మేము ఏం చేశామో ప్రజలకు తెలుసని ప్రధాని మోడీ అన్నారు.   

Spread the love
venkat seelam

Recent Posts

దక్షిణ బంగాళాఖాతంను తాకిన నైరుతి రుతుపవనాలు

రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…

3 hours ago

ఈనెల 22న రాష్ట్ర గవర్నర్‌ అబ్ధుల్‌ నజీర్‌ జిల్లా పర్యటన

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎం హరినారాయణన్‌…

22 hours ago

తిరుపతి,అనంతపురం, పల్నాడు జిల్లాలకు కొత్త కలెక్టర్,ఎస్పీలు

FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…

24 hours ago

ఖాళీ బాటిల్, క్యానులలో పెట్రోల్ అమ్మకాలపై నిషేధం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌‌‌లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…

1 day ago

రణరంగాన్ని తలపించిన తైవాన్ పార్లమెంట్

అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…

1 day ago

వైభ‌వంగా శ్రీ సీతా జ‌యంతి

తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామి ఆల‌యంలో శుక్ర‌వారం వైభ‌వంగా సీతా జ‌యంతి ఉత్స‌వం నిర్వ‌హించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…

2 days ago

This website uses cookies.