AMARAVATHI

టీటీడీ ఎలక్ట్రిక్ బస్సు చోరీ-చార్జీంగ్ అయిపోవడంతో..

తిరుమల: తిరుమలలో శ్రీవారి ఉచిత ధర్మరథం ఎలక్ట్రిక్ బస్సును శనివారం రాత్రి చార్జింగ్ స్టేషన్ వద్ద బస్సుకు చార్జింగ్ పెట్టిన డ్రైవర్ ప్రక్కకు వెళ్లాడు..తిరిగి వచ్చి చూడగా చార్జీంగ్ లో వుండాల్సిన బస్సు కనిపించకపోవడంతో అధికారులకు సమాచారం అందించాడు..సాలకట్ల బ్రహ్మోత్సవాల సమయంలో అందరూ బిజీ గా వున్న సమయంలో,,దుండగుడు విద్యుత్ బస్సును డ్రైవ్ చేసుకుంటు వెళ్లాడు..డ్రైవర్ అందించిన సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగి బస్సు కోసం గాలింపు చేపట్టారు..GPS లొకేషన్ ఆధారంగా సదరు బస్సు నాయుడుపేట బైపాస్ రోడ్డు వద్ద ఉన్నట్లు గుర్తించారు..బస్సులో చార్జీంగ్ అయిపోవడంతో దుండగుడు ఆదివారం తెల్లవారుజామున 3.53 గంటలకు రోడ్డులో వదిలి పరారీ అయ్యాడు..
టీటీడీ ఎలక్ట్రికల్ ఉచిత బస్సు చోరీకి గురికావడం ఇది రెండవసారి..గతంలోనూ టీటీడీకి చెందిన బ్యాటరీ వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి చేశారు..బ్యాటరీ వాహనంలో చార్జింగ్ అయిపోవడంతో,,కడప జిల్లా ఒంటిమిట్ట వద్ద వదిలి వెళ్లారు..ఇలాంటి సంఘటన చోటు చేసుకోవటంతో అధికారుల నిఘా తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించే పనిలో పడ్డారు.
బస్సు చోరీ ఘటన నేపథ్యంలో,,టీటీడీ ట్రాన్స్ పోర్టు GM శేషారెడ్డిపై పోలీసులు సీరియస్ అయ్యారు… వారంరోజుల క్రితం కారు మిస్సింగ్ ఘటనపై కూడా పోలీసులకు ట్రాన్స్ పోర్టు GM శేషారెడ్డి సమాచారం అందించలేదని తెలుస్తొంది..ఆదివారం బస్సు మిస్సింగ్ ఘటనలోనూ మీడియాలో వార్తలు వచ్చే వరకు పోలీసులకు సమాచారం ఇవ్వలేదు..భక్తులకు సంభంధించిన వాహనాలకు,,రవాణా వాహనలకు పూర్తి స్థాయిలో భధ్రతా ఏర్పాట్లు పరిశీలన జరిపి,,పూర్తి బాధ్యతను జీయం తీసుకొవాలని పోలీసులు సూచించారు..వాహనాలు చోరికి గురైనా సమాచారం అందించకపోవడంతో FIRలో GM శేషారెడ్డి పేరు చేర్చే యోచనలో పోలీసులు ఉన్నట్లు తెలిసింది.. FIRలో GM పేరు చేర్చితే,,అతన్ని సస్పెండ్ చేసే యోచనలో టీటీడీ ఉన్నతాధికారులు ఉన్నట్లు సమాచారం..అది ఎట్లా జరగదు???

Spread the love
venkat seelam

Recent Posts

ఈనెల 22న రాష్ట్ర గవర్నర్‌ అబ్ధుల్‌ నజీర్‌ జిల్లా పర్యటన

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎం హరినారాయణన్‌…

3 hours ago

తిరుపతి,అనంతపురం, పల్నాడు జిల్లాలకు కొత్త కలెక్టర్,ఎస్పీలు

FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…

5 hours ago

ఖాళీ బాటిల్, క్యానులలో పెట్రోల్ అమ్మకాలపై నిషేధం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌‌‌లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…

5 hours ago

రణరంగాన్ని తలపించిన తైవాన్ పార్లమెంట్

అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…

10 hours ago

వైభ‌వంగా శ్రీ సీతా జ‌యంతి

తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండ‌రామ‌స్వామి ఆల‌యంలో శుక్ర‌వారం వైభ‌వంగా సీతా జ‌యంతి ఉత్స‌వం నిర్వ‌హించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…

1 day ago

స్ట్రాంగ్ రూముల వద్ద ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొండి-ముఖేష్ కుమార్ మీనా

నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…

1 day ago

This website uses cookies.