AMARAVATHI

ఈ నెల 24న తెలుగు రాష్ట్రాలకు మరో రెండు వందేభారత్ రైళ్లు

అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో మరో 2 వందేభారత్ ఎక్స్ ప్రెస్ లు పరుగులు తీయ్యనున్నాయి..ఇందులో ఒకటి బెంగళూరుకు,,మరోకటి చెన్నైవెళ్లే ప్రయాణీకుల కోసం..హైదరాబాద్, బెంగళూరు మధ్య పరుగులు పెట్టే ఈ రైలును ప్రధాని మోదీ సెప్టెంబరు 24వ తేదిన వర్చువల్ గా పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు..ఆదే రోజున కాచిగూడ నుంచి ఉదయం 5.30 గంటలకు ట్రైన్ బయల్దేరి మధ్యాహ్నం 2 గంటలకు యశ్వంత్ పూర్ చేరుకోనున్నది.. 25వ తేది నుంచి ఈ రైలు ప్రయాణీకులకు అందుబాటులో ఉంటుంది..సోమవారం ఉదయం 5.30 గంటలకు బయలుదేరి,, మహబూబ్ నగర్, కర్నూలు, అనంతపురం, ధర్మవరం, హిందూపురం మీదుగా మధ్యాహ్నం 2.30 గంటలకు యశ్వంత్ పూర్ కు చేరుకుంటుంది..తిరిగి 2.45 నిమిషాలకు యశ్వంత్ పూర్ నుంచి బయలుదేరి రాత్రి 11 గంటల 45 నిమిషాలకు కాచిగూడ చేరుకుంటుంది..అలాగే విజయవాడ-చెన్నై వందేభారత్ ఈ రైలు విజయవాడ నుంచి తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట మీదుగా చెన్నై చేరుకుంటుంది..గురువారం మినహా అన్ని రోజులు ఈ ట్రైన్ ప్రయాణీకులకు అందుబాటులో ఉంటుంది.. వందేభారత్ ఎక్స్ ప్రెస్ రోజూ 5.30 గంటలకు విజయవాడలో బయలుదేరి, 12.10 నిమిషాలకు చెన్నై చేరుకుంటుదని వివరించారు..తిరిగి చెన్నైలో మధ్యాహ్నం 3.20 నిమిషాలకి ప్రారంభమై రాత్రి 10 గంటలకు విజయవాడకు చేరుతుందని,,ఈ రైలుతో పాటు సెప్టెంబర్ 24వ తేదిన ప్రధాని మోదీ మొత్తం 9 వందేభారత్ రైళ్లను వర్చువల్ గా ప్రారంభించనున్నారని రైల్వే అధికారులు తెలిపారు.

Spread the love
venkat seelam

Recent Posts

ప్రమాదంకు గురైన ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్నహెలికాప్టర్ ?

అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…

14 hours ago

దక్షిణ బంగాళాఖాతంను తాకిన నైరుతి రుతుపవనాలు

రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…

19 hours ago

ఈనెల 22న రాష్ట్ర గవర్నర్‌ అబ్ధుల్‌ నజీర్‌ జిల్లా పర్యటన

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎం హరినారాయణన్‌…

2 days ago

తిరుపతి,అనంతపురం, పల్నాడు జిల్లాలకు కొత్త కలెక్టర్,ఎస్పీలు

FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…

2 days ago

ఖాళీ బాటిల్, క్యానులలో పెట్రోల్ అమ్మకాలపై నిషేధం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌‌‌లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…

2 days ago

రణరంగాన్ని తలపించిన తైవాన్ పార్లమెంట్

అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…

2 days ago

This website uses cookies.