అమరావతి: ఎట్టకేలకు వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని భారత్ కు తీసుకుని వచ్చేందుకు దాదాపు లైన్ క్లియర్ అయింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ను రూ.11 వేల కోట్ల మేర మోసగించి,బ్రిటన్ లో తలదాచుకుంటున్న నీరవ్ మోదీని భారత్కు అప్పగింత ఆదేశాలను సవాలు చేస్తూ గతంలో అతడు దాఖలు చేసిన పిటిషన్ను యూకే న్యాయస్థానం బుధవారం తోసిపుచ్చింది. దీంతో ఎట్టకేలకు భారత దర్యాప్తు ఏజెన్సీల కృషి ఫలించినట్టయ్యింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ మోసం కేసులో వేల కోట్ల రూపాయల మోసం, మనీ ల్యాండరింగ్ కేసుల్లో నీరవ్ మోదీ నిందితుడిగా ఉన్నాడు. నీరవ్ మోదీని భారత్కు అప్పగించాలంటూ గత ఫిబ్రవరిలో వెస్ట్మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్ట్ డిస్ట్రిక్ట్ జడ్జి సామ్ గూజెస్ గత ఫిబ్రవరిలో తీర్పునిచ్చారు.ఈ తీర్పుని సవాలు చేస్తూ లండన్ కోర్టులో నీరవ్ మోదీ పిటిషన్ దాఖలు చేశాడు. ఫిబ్రవరిలో ఈ కేసుని పరిశీలించిన లార్డ్ జస్టిస్ జెరెమీ స్టువర్ట్-స్మిత్, జస్టిస్ రాబర్ట్ జయ్ బుధవారం తాజా తీర్పునిచ్చారు.
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణన్…
FIR లలో ఉన్న సెక్షన్లు సరిపోతాయా,సిట్ అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో తాజాగా పల్నాడు…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు తరువాత తిరుపతి,,అనంతపురం,, పల్నాడు జిల్లాల్లో జరిగిన గొడవలతో శాంతి భద్రతలు అదుపు తప్పాయి..వైసీపీ, టీడీపీ కార్యకర్తల…
అమరావతి: ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధుల మద్య విధాన పరమైన నిర్ణాయలు జరిగే సమయంలో విపక్షాల నిరసనలు, వ్యతిరేకతలు సర్వసాధారణాంగ జరుగుతుంటాయి..నిరసనల స్థాయి…
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
This website uses cookies.