AMARAVATHI

నామినేషన్ దాఖలు చేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి,పొంగూరు.నారాయణ

4వ రోజు 30 మంది అభ్యర్థులు..
నెల్లూరు రూరల్ లో ఆదాల, సిటీలో నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో 4వ రోజు సోమవారం పలు రాజకీయ పార్టీల అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. జిల్లావ్యాప్తంగా 30 మంది అభ్యర్థులు 41 సెట్ల నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారులకు అందజేశారు.
నెల్లూరు పార్లమెంటు స్థానానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రెండు సెట్ల నామినేషన్ పత్రాలను, ఇండిపెండెంట్ అభ్యర్థిగా కొప్పాల రఘు ఒక సెట్ నామినేషన్ పత్రాలను నెల్లూరు పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి హరి నారాయణన్ కు అందజేశారు.
నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గా పొంగూరు నారాయణ, పొంగూరు రమాదేవి, వైఎస్ఆర్సిపి అభ్యర్థి ఖలీల్ అహ్మద్ తరఫున పార్టీ జిల్లా అధ్యక్షుడు పర్వత్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఒక సెట్టు నామినేషన్ పత్రాలను మునిసిపాల్ కార్పొరేషన్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి వికాస్ కు అందజేశారు.
నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రెండు సెట్ల నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి మలోలకు అందించారు.
సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైయస్ఆర్సీపీ అభ్యర్థులుగా కాకాని గోవర్ధన్ రెడ్డి, కాకాని పూజిత చెరో రెండు సెట్లను, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పూల చంద్రశేఖర్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి చిన్న ఓబులేసుకు అందజేశారు.
ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఆనం రామనారాయణ రెడ్డి నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి మధులతకు అందజేశారు. వైయస్సార్సీపి అభ్యర్థి మేకపాటి విక్రం రెడ్డి తరపున ఒక సెట్ నామినేషన్ దాఖలు అయింది.
ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కాకర్ల సురేష్ ఒక సెట్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి ప్రేమ్ కుమార్ కు అందజేశారు.
కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ సిపి అభ్యర్థులుగా బుర్రా మధుసూదన్ రావు, తాడికొండ రాంబాబు ఒక సెట్ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి విద్యాధరికి అందజేశారు.
ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు పలువురు ఇండిపెండెంట్ అభ్యర్థులు, ఇతర పార్టీల అభ్యర్థులు కూడా తమ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారులకు అందజేశారు.

Spread the love
venkat seelam

Recent Posts

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

41 mins ago

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టం భద్రత,కౌంటింగ్ డే రోజున పటిష్ట చర్యలు తీసుకొండి-సీఈసీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…

46 mins ago

అక్రమ ఇసుక తవ్వకాలపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు

రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…

3 hours ago

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

24 hours ago

రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలపై తీవ్రంగ స్పందించిన భారత ఎన్నికల సంఘం

సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…

1 day ago

రాష్ట్రంలో రికార్డు స్థాయి నమోదైన పోలింగ్- 81.76 శాతం

అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…

1 day ago

This website uses cookies.