AMARAVATHI

నైతిక విలువలతో ఓటుహక్కును వినియోగించుకోవాలి-కలెక్టర్ హరినారాయణన్

దేశ భవిష్యత్ ను మార్చే శక్తి ఒక్క ఓటుకే ఉంది..
నెల్లూరు: భారత రాజ్యాంగం మనకు ప్రసాదించిన అత్యంత విలువైన ఓటుహక్కును నైతిక విలువలతో ప్రతిఒక్కరూ వినియోగించుకుని, దేశ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎం హరినారాయణన్ పిలుపునిచ్చారు. గురువారం నెల్లూరు కలెక్టరేట్ లోని తిక్కనప్రాంగణంలో 14వ జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులనుద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ 1949 నవంబరు 26న మన రాజ్యాంగం ఆమోదం పొందిన తరువాత 1950 జనవరి 25న భారత ఎన్నికల సంఘం ఆవిర్భావమైందని, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏడాది జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించుకున్నట్లు చెప్పారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, సుమారు 96 కోట్ల ఓటర్లు ఉన్న మన దేశంలో ప్రతిఒక్కరూ తప్పనిసరిగా గుర్తుపెట్టుకుని జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకోవడం మనందరి గర్వకారణంగా భావించాలన్నారు. ‘‘ఈ దేశం మనకు ఏమి ఇచ్చిందని కాకుండా, దేశానికి మనం ఏమి ఇచ్చాం’’ అనే ప్రముఖ రాజకీయవేత్త జోసఫ్ కెనడి పిలుపును అందరూ అందిపుచ్చుకోవాలని ఈ సందర్భంగా కలెక్టర్ పిలుపునిచ్చారు. మన దేశం భావిభారత తరాలకు కూడా ప్రజాస్వామ్య విలువలను అందించేలా, అత్యంత శక్తివంతమైన దేశంగా తయారయ్యేలా యువతీ యువకులు తమ ఓటుహక్కును నైతిక విలువతో ఉపయోగించుకుని మంచి నాయకులను ఎన్నుకోవాలని సూచించారు.
తొలిసారి ఓటుహక్కు పొందిన విద్యార్థుల ఉపన్యాసాలు అందరిని ఆకట్టుకున్నారు. ఓటుహక్కును అమ్ముకుంటే మనల్ని మనం అమ్ముకున్నట్లేనని, బాగా ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుని ఓటుహక్కు వినియోగించాలన్న గొప్ప సందేశంతో విద్యార్థులు తమ ఉపన్యాసాల్లో వివరించారు. ఓటు గొప్పతనాన్ని వివరించిన కృష్ణచైతన్య కళాశాలకు చెందిన లక్ష్మీ నరసింహ, వర్ష, సాదిక్ ను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు.తొలుత గాంధీబొమ్మ నుంచి కలెక్టరేట్ వరకు అధికారులు, విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు.

Spread the love
venkat seelam

Recent Posts

రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలపై తీవ్రంగ స్పందించిన భారత ఎన్నికల సంఘం

సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…

2 hours ago

రాష్ట్రంలో రికార్డు స్థాయి నమోదైన పోలింగ్- 81.76 శాతం

అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…

6 hours ago

బుద్ది మార్చుకోని ప‌శ్చిమ దేశాలు-ఎన్నికల నిర్వహణపై మనకు పాఠలా-జయశంకర్

అమరావతి: భార‌త్‌లో జ‌రుగుతున్న సార్వత్రిక ఎన్నిక‌ల‌పై ఇటీవ‌ల అమెరికా,, కెన‌డా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్య‌లపై విదేశాంగ మంత్రి…

6 hours ago

గుంటూరు జిల్లా వద్ద ఘోర అగ్ని ప్రమాదంకు గురైన ప్రవేట్ ట్రావెల్స్ బస్సు-5 సజీవదహనం

5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్‌…

10 hours ago

మూడు దశాబ్దల తరువాత శ్రీనగర్ లో రికార్డు స్థాయిలో ఓటు వేసిన ప్రజలు

38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…

1 day ago

వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేష‌న్ దాఖ‌లు నరేంద్రమోదీ

అమరావతి: ప్ర‌ధాని దామోదర్ దాస్ న‌రేంద్ర మోదీ వార‌ణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేష‌న్ దాఖ‌లు చేశారు..వార‌ణాసి జిల్లా…

1 day ago

This website uses cookies.