నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని వివిధ సమస్యల పరిష్కారానికై రూపొందించిన స్పందన వేదికను సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ జాహ్నవి సూచించారు..సోమవారం నగర పాలక సంస్థ కార్యాలయంలో స్పందన వేదికను కౌన్సిల్ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ స్పందన వేదికలో ఒకసారి స్వీకరించిన సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పిస్తున్నామని, సమస్య పునరావృతం కాకుండా అధికారులనుంచి సిబ్బంది వరకు కృషి చేస్తున్నామని వివరించారు..అదేవిధంగా టిడ్కో హౌసింగ్, రెవెన్యూ, పారిశుధ్యం, టౌన్ ప్లానింగ్ విభాగాలకు సంభందించి 23 అర్జీలను ప్రజలనుంచి అందుకున్నామని, అందుకున్న ఫిర్యాదులకు స్పందన వేదిక ద్వారా వేగవంతమైన పరిష్కారం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. జగనన్న కాలనీ నివేశన స్థలాలు, టిడ్కో గృహాల మంజూరు వివరాలను లబ్ధిదారులకు తెలియజేసేందుకు కార్యాలయంలోని నోటీసు బోర్డులో ప్రదర్శిస్తున్నామని కమిషనర్ చెప్పారు..అదేవిధంగా వివిధ సంక్షేమ పథకాలకు అర్హులైన వారి జాబితాలను కార్యాలయంతో పాటు సచివాలయాల్లో సైతం అందుబాటులోకి తెచ్చామని, పథకాలకు సంభందించిన వివరాలకై సంబంధిత శాఖ అధికారులను సంప్రదించాలని కమిషనర్ సూచించారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థలోని అన్ని శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…
అమరావతి: మే 13వ తేదిన ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల రోజు, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల బాధ్యులు అయిన…
దొరికిన ఎమ్మేల్యే కాకాణి కారు ? అమరావతి: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో రేవ్పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని…
ఓల్డ్ మోడల్ హెలికాప్టర్ వల్లే ప్రమాదం? అమరావతి: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) అదివారం హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందారు.. ఆయన…
అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…
రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…
This website uses cookies.