DISTRICTS

ఉత్తరాంధ్రలో దోపిడీనీ ప్రశ్నించినందుకు అయ్యన్నపై వైసీపీ ప్రభుత్వం కక్ష కట్టింది-సోమిరెడ్డి

నెల్లూరు: రెండు సెంట్లు భూమిని ఆక్రమించినందుకు అయ్యన్నను అరెస్ట్ చేస్తే, 200 ఎకరాలు ఆక్రమించిన వైఎస్ కుటుంబాన్ని ఏం చేయాలి,,175 కి 175 సీట్లు ఓడిపోతున్నామన్న ఫ్రస్టేషన్లో జగన్మోహన్ రెడ్డి దిగజారుడు ధోరణితో వ్యవహరిస్తున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి.చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. గురువారం మాజీ మంత్రివర్యులు అయ్యన్నపాత్రుడు అక్రమ అరెస్టుకు నిరసనగా నగరంలోని అంబేద్కర్ విగ్రహనికి తెలుగుదేశం పార్టీ నాయకులు వినతిపత్రం సమర్పించి అనంతరం కూడలిలో నిరసన చేపట్టారు.ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ టిడిపి జనసేన కలయికతో వైసిపి ఓడిపోతుందన్న భయంతో అక్రమ కేసులతో భయపెట్టాలని చూస్తున్నారని,,జగన్మోహన్ రెడ్డి కింద జీతగాళ్లలా మారిన కొంత పోలీసుల వల్ల మొత్తం పోలీసు వ్యవస్థ పై మధ్య పడిందని అన్నారు. ఆంధ్ర పోలీసులకు అసలైన నేరస్తులను దోపిడీదారులను శిక్షించే ధైర్యం లేదని కేవలం నిరసన తెలిపే వారి మీదే అక్రమ కేసులు బనాయించడమే పనిగా పెట్టుకున్నారన్నారు. విశాఖ నగర చుట్టుపక్కల ప్రాంతాల లో 20 వేల ఎకరాలు వైసీపీ నాయకుల చేత దోపిడీ కు గురైందనీ దాన్ని ప్రశ్నించడం అయ్యన్న చేసిన తప్పా? మూడున్నర ఏళ్ల కాలంలో వైసీపీ నాయకులు 2 లక్షల కోట్లు దోచుకు తింటుంటే టీడీపీ నాయకులు ప్రశ్నించకుడదా అంటూ నిలదీశారు.ఈ కార్యక్రమంలో బీద రవిచంద్ర,నగర నియోజకవర్గ ఇంచార్జీ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, వెంకటగిరి నియోజకవర్గ ఇన్చార్జి కురుగొండ్ల రామకృష్ణ, మురళి కన్నబాబు, సతీష్ రెడ్డి, తాళ్ళపాక అనురాధ,రేవతి, జెన్నీ రమణయ్య, గంజాం రాఘవేంద్ర,పీ ఎల్ రావు,కప్పిర శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు

Spread the love
venkat seelam

Recent Posts

ఈసీ సస్పెండ్ చేసిన పోలీసు అధికారుల స్థానంలో కొత్తవారికి పోస్టింగ్ లు

అమరావతి: మే 13వ తేదిన ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల రోజు, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల బాధ్యులు అయిన…

19 seconds ago

బెంగళూరు జరిగిన రేవ్‌ పార్టీలో 100 మంది అరెస్ట్- టీవీ నటీనటులు,మోడల్స్

దొరికిన ఎమ్మేల్యే కాకాణి కారు ? అమరావతి: కర్ణాటక రాజధాని బెంగళూరు సమీపంలో రేవ్‌పార్టీ జరిగింది. ఎలక్ట్రానిక్‌ సిటీ సమీపంలోని…

1 hour ago

ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి

ఓల్డ్ మోడల్ హెలికాప్ట‌ర్ వల్లే ప్రమాదం? అమరావతి: ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ(63) అదివారం హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతిచెందారు.. ఆయన…

2 hours ago

ప్రమాదంకు గురైన ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్నహెలికాప్టర్ ?

అమరావతి: ఇరాన్ ప్రెసిడెంట్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైనట్లు అక్కడి మీడియా తెలిపింది..ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ కాన్వాయ్…

20 hours ago

దక్షిణ బంగాళాఖాతంను తాకిన నైరుతి రుతుపవనాలు

రోహిణి కారై ఎండ ప్రతాపం చూడకుండానే ? అమరావతి: రెండున్నర సంవత్సరాల “ఎలనినో” సీజన్ ముగియడం,,మే నెల ప్రారంభం నుంచే…

1 day ago

ఈనెల 22న రాష్ట్ర గవర్నర్‌ అబ్ధుల్‌ నజీర్‌ జిల్లా పర్యటన

నెల్లూరు: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ ఈనెల 22న జిల్లా పర్యటనకు రానున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఎం హరినారాయణన్‌…

2 days ago

This website uses cookies.