తిరుపతి: ఏపీ విద్యా హక్కు చట్టం సెక్షన్ 12(1)(C) మేరకు పేద విద్యార్థులకు ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలలల్లో 1 వ తరగతిలో ఉచిత ప్రవేశానికి అవకాశం కల్పించడం జరిగిందని తిరుపతి జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణారెడ్డి తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన పేద కుంటుంబాల విద్యార్థులకు ప్రైవేట్ అన్ ఎయిడెడ్ విద్యాసంస్థల్లో, 2023-24 విద్యా సంవత్సరం 1వ తరగతిలో అడ్మిషన్ కొరకు ఏప్రిల్ 1వ తేదీ నాటికి 5 సంవత్సరాలు వయస్సు పూర్తి అయిన పిల్లల వివరాలతో ఏప్రిల్ 10వ తేదీ లోపు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. జిల్లాలో 423 ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో 4230 మందికి అవకాశం వుందన్నారు..విద్యా హక్కు చట్టం-2009,AP RTE 2023, సెక్షన్ 12(1)(C) ప్రకారం ప్రవేట్ అన్ ఎయిడెడ్ విద్యా సంస్థల్లో 25% సీట్లు ఆర్థికంగా వెనుకబడిన తరగతుల పేద కుటుంబాలకు కేటాయింపు కొరకు నిబంధనలు పొందుపరచడం జరిగిందన్నారు.. http://cse.ap.gov in/RTE వెబ్ సైట్ నందు నమోదు చేసుకోవాలని తెలిపారు..సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వారు, దారిద్ర్యరేఖకు దిగువున వున్నవారు, భూమిలేని వ్యవసాయ కూలీలు, దివ్యాంగులు, ఎస్.సి, ఎస్టీలు అర్హులని, గ్రామ/వార్డు సచివాలయాల్లో ఉచిత దరఖాస్తు సదుపాయం కల్పించబడిందని పిల్లల తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…
నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…
44 డివిజన్ ఎన్నికల ప్రచారం.. నెల్లూరు: యువత భవిష్యత్తే...రాష్ట్ర భవిష్యత్ అని...మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆలోచన అని మాజీ…
అమరావతి: ఆర్చరీ వరల్డ్ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…
అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…
=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…
This website uses cookies.