AMARAVATHI

43 సెకండ్లు ఆలస్యంతో లూనా-25 విఫలం అయింది-ఏజెన్సీ డైరెక్టర్ యూరి బోరిసోవ్

అమరావతిం రష్యా 50 సంవత్సరాల తరువాత చంద్రునిపైకి ప్రయోగించిన స్పేస్ మాడ్యూల్ లూనా-25 విఫలం కావడంతో ఈ వెస్ట్రన్(పశ్చిమదేశాలు) మీడియా సంస్థలు స్పేస్ టెక్నాలాజీ పూర్తిగా విఫలమైందటూ వార్త కథనాలను ప్రచురించాయి..నేటి వరకు స్పేస్ టెక్నాలాజీలో రష్యాకు తిరుగులేదు..రష్యా స్పేస్ మాడ్యూల్ లూనా-25 చంద్రుడిపై దగ్గరకు చేరుకునే సమయంలోనే అది దారి తప్పింది..ఇలా జరగడానికి గల కారణాలను రష్యా అంతరిక్ష సంస్థ రాస్ కాస్మోస్ తాజాగా వెల్లడించింది..నిర్దేశిత సమయంలో ఆ మాడ్యూల్ లోని ఇంజిన్లు ఆఫ్ కాలేదని, దాంతో లూనా-25 అనుకున్న కక్ష్యను దాటి మరో కక్ష్యలోకి వెళ్లిందని సదరు ఏజెన్సీ డైరెక్టర్ యూరి బోరిసోవ్ ఒక టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వులో తెలిపారు. సరైన సమయానికి ఇంజిన్లు ఆఫ్ కాకపోవడం వల్ల అది కుప్పకూలిందని తెలిపారు..తాము ముందుగా డిజైన్ చేసిన సమయానికి ఇంజిన్ 84 సెక్లనలో ఆఫ్ కావాలని, అయితే ఆ ప్రక్రియ జరిగేందుకు 127 సెకన్లు పట్టిందని, ఫలితంగా చంద్రుని ఉపరితలంపై అది నియంత్రణ కోల్పోయి కూలిందని బోరిసోవ్ పేర్కొన్నారు..ఈ ప్రయోగం ఫెయిల్ కావడానికి గల ఇతర కారణాలను తెలుసుకోవడం కోసం తాము మరింత లోతుగా పరిశోధనలు చేస్తున్నమని,, ఇందుకోసం ఒక ప్రత్యేక కమీషన్ని ఏర్పాటు చేశామని తెలిపారు..ప్రొపల్ష న్ సిస్టమ్ లో మిషన్ ఆపరేషన్ అనుకున్న సమయానికి జరగలేదని, లూనార్ ఆర్బిట్ నుంచి వ్యోమనౌక ముందుకు వెళ్లిందని చెప్పారు..ఈ మూన్ మిషన్ విఫలమైనప్పటికీ,,తమ స్పేస్ ఇంజినీర్లు విలువైన అనుభవాన్ని గ్రహించారన్నారు..ఈ మిషన్ లో జరిగిన పొరపాట్లను పరిగణలోకి తీసుకుని,,భవిష్యత్తులో లూనా-26, 27, 28 మిషన్లు తప్పకుండా విజయవంతంగా ప్రయోగిస్తామన్నధీమా వ్యక్తం చేశారు.

Spread the love
venkat seelam

Recent Posts

అక్రమ ఇసుక తవ్వకాలపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు

రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…

28 mins ago

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

22 hours ago

రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలపై తీవ్రంగ స్పందించిన భారత ఎన్నికల సంఘం

సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…

24 hours ago

రాష్ట్రంలో రికార్డు స్థాయి నమోదైన పోలింగ్- 81.76 శాతం

అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…

1 day ago

బుద్ది మార్చుకోని ప‌శ్చిమ దేశాలు-ఎన్నికల నిర్వహణపై మనకు పాఠలా-జయశంకర్

అమరావతి: భార‌త్‌లో జ‌రుగుతున్న సార్వత్రిక ఎన్నిక‌ల‌పై ఇటీవ‌ల అమెరికా,, కెన‌డా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్య‌లపై విదేశాంగ మంత్రి…

1 day ago

గుంటూరు జిల్లా వద్ద ఘోర అగ్ని ప్రమాదంకు గురైన ప్రవేట్ ట్రావెల్స్ బస్సు-5 సజీవదహనం

5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్‌…

1 day ago

This website uses cookies.