AMARAVATHI

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియో

అమరావతి: ప్రతి రోజు నూతన అవిష్కరణలతో టెక్నాలజీ అందుబాటులోకి వస్తున్న ఈ తరుణంలో (AI) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో గణనీయమై మార్పులు చోటుచేసుకుంటున్నాయి..ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించి, ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..ఈ వీడియోలో ఓ వ్యక్తి ఫేక్ వీడియో గురించి మాట్లాడుతుండగా,, ఆ వీడియో పై భాగంలోనే మరో వీడియోలో అచ్చం అదే వ్యక్తి స్టైల్ లో సెలబ్రెటీలు మాట్లాడుతున్నట్టుగా తల భాగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో మార్ఫింగ్ చేసి చిత్రీకరించారు.. ఈ విషయాన్ని కింద వీడియోలో ఉన్న వ్యక్తి తెలియచేస్తే, తప్ప గుర్తించలేని పరిస్థితి కన్పిస్తుంది..మొదటి సారి చూసిన వాళ్లెవరైనా అదే నిజమైన వీడియో అని నమ్మే పరిస్థితి.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోన్న ఈ వీడియోను షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా,, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ గురించి హెచ్చరిస్తూ,,ఈ వీడియో మనకు ఒక మేలుకొలుపు వంటిదని చెప్పారు.. ఇలాంటి మోసపూరిత వీడియోల నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు మనం ఏ మేరకు సన్నద్ధమవుతున్నామనేది ఆలోచించాలని కోరారు..ఇలాంటివి చూడడానికి వినోదభరితంగా ఉండొచ్చేమో కానీ… అవే అత్యంత దారుణమైనవన్నారు.. అవే ప్రజల మధ్య వివిధ పరిస్థితులను సృష్టించి,,విధ్వసం కలిగిస్తే, మీరు  ఏంచేస్తాం ? అని ప్రశ్నించారు.. ఇటువంటి శక్తిమంతమైన వ్యవస్థలతో రూపొందించిన ఫేక్ కంటెంట్ నుంచి రక్షణ కోసం తనిఖీ వ్యవస్థలు ఉండాలి కదా ? అంటూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు..(వీడియోను ఒకటికి రెండు సార్లు చూడండి.)

Spread the love
venkat seelam

Recent Posts

అవ‌స‌ర‌మైనంత కాలం రిజ‌ర్వేష‌న్లు కొన‌సాగించాల్సిందే- మోహన్ భగవత్

అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…

18 hours ago

కేంద్ర ఎన్నికల పరిశీలకుల సమక్షంలో రెండో విడత మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ ర్యాండమైజేషన్

నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…

19 hours ago

యువ‌త భ‌విష్యత్తే  మన రాష్ట్ర భవిష్య‌త్‌- డాక్ట‌ర్ పొంగూరు.నారాయణ

44 డివిజ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారం.. నెల్లూరు: యువ‌త భ‌విష్య‌త్తే...రాష్ట్ర భ‌విష్య‌త్ అని...మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు ఆలోచ‌న అని మాజీ…

2 days ago

ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో చరిత్ర లిఖించిన భారతీయ ఆర్చర్లు

అమరావతి: ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…

2 days ago

వైసీపీ మేనిఫెస్టో తేలిపోయిందా? ముఖ్యనేతల్లో తీవ్ర అసంతృప్తి

అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…

2 days ago

పించన్లు ,ఇంటింటికి వెళ్లి ఇవ్వండి లేదంటే అకౌంట్ కు బదలీ చేయండి-ఈ.సీ

=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…

2 days ago

This website uses cookies.