మేకిన్ ఇన్ ఇండియా..
అమరావతి: మేకిన్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ బాగంగా భారత నావికా దళానికి 9 సముద్ర నిఘా విమానాలు, కోస్ట్ గార్డ్ కు 6 గస్తీ విమానాలను కొనుగోలు చేసేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది.. 15 మారిటైమ్ పెట్రోల్ ఎయిర్క్రాఫ్ట్ లను,,C-295 రవాణా విమానాలను దేశీయంగా తయారు చేయనున్నారు.. ఈ ఒప్పందం విలువ మొత్తం రూ.29 వేలకోట్లు.. రక్షణ మంత్రిత్వ శాఖ కాన్పూర్కు చెందిన కంపెనీతో రూ.1752.13 కోట్లతో ఒప్పందం చేసుకున్నది..ఈ డీల్ కింద 12.7 MM రిమోట్ కంట్రోల్డ్ గన్స్ 463 కొనుగోలు చేయనున్నది.. ఈ గన్స్ ను నేవీతో పాటు కోస్ట్ గార్డ్ సిబ్బందికి అందించనున్నారు.. ఈ ఒప్పందాల కారణంగా భారతదేశ సముద్రశక్తిని పెంచడంతో పాటు స్వావలంభన భారత్కు ప్రోత్సాహం అందిస్తాయని రక్షణశాఖ మంత్రిత్వ శాఖ వర్గాలు పేర్కొన్నాయి.. టాటా అడ్వాన్స్ డ్ సిస్టమ్స్,, ఎయిర్బస్ సంయుక్తంగా విమానాలను తయారు చేయనున్నారు..వీటిలో అత్యాధునిక రాడార్, సెన్సార్లు అమరుస్తారు.. హిందు మహాసముద్రంలో పాగా వేసేందుకు కంత్రీ చైనా ప్రయత్నిస్తున్నది..అదే సమయంలో అంతర్జాతీయ షిప్పింగ్ మార్గాలపై దాడులు పెరుగుతున్న నేపధ్యంలో ఇలాంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత నావికాదళం సామర్థ్యం నిరంతరం పెంచుకుంటున్నది.
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
This website uses cookies.