కోళ్లకు ఇన్ఫ్లో ఎంజా వ్యాధి..
నెల్లూరు: జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి( AVIAN INFLUENZA) వ్యాప్తి చెందకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎం.హరినారాయణన్ అధికారులను ఆదేశించారు.గురువారం క్యాంపు కార్యాలయంలో సంబంధిత అధికారులతో బర్డ్ ఫ్లూ నివారణపై జిల్లా కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం బర్డ్ ఫ్లూ వ్యాధి ప్రబలకుండా అధికారులందరూ సమన్వయంతో పని చేయాలన్నారు. పొదలకూరు మండలం చాటగుట్ల, కోవూరు మండలం గుమ్మళ్ళదిబ్బ గ్రామాలలో ఇటీవల ఇన్ఫ్లుఎంజా వ్యాధి తో కోళ్లు పెద్ద ఎత్తున చనిపోవడంతో పశుసంవర్ధక శాఖ అధికారులు భోపాల్ లోని టెస్టింగ్ కేంద్రానికి పంపారని ఇన్ఫ్లో ఎంజా నిర్ధారణ కావడంతో, వ్యాధి ప్రబలకుండా అదుపు చేయడానికి అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. నిబంధనల ప్రకారం, కోళ్లు మృతిచెందిన ప్రాంతానికి పది కిలోమీటర్ల పరిధి లో 3 రోజులపాటు చికెన్ షాపులు మూసివేయాలని ఒక కిలోమీటర్ పరిధిలో మూడు నెలల వరకు షాపులు తెరవకూడదని ఆ ప్రకారం సంభందిత అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని తెలిపారు. వ్యాధి సోకిన ప్రాంతం నుండి 15 రోజుల వరకు కోళ్లు బయటకు వెళ్లకూడదని, వేరే ప్రాంతం నుండి కోళ్లను తీసుకురాకూడదని అన్నారు. చనిపోయిన కోళ్లను భూమిలో పాతి పెట్టాలన్నారు. కోళ్ల ఫాంలు,,ఆ కోళ్ల వద్ద పనిచేసే మనుషులు జాగ్రత్తగా ఉండాలన్నారు. జిల్లా పంచాయతీ అధికారి ,Z.P.CEO ఆ రెండు గ్రామాలలో శుక్రవారం ఉదయం MPDO,,POPRD వెటర్నరీ డాక్టర్, రెవిన్యూ ఇతర శాఖలో అధికారులతో కలసి గ్రామసభలు నిర్వహించి ప్రజలలో,కోళ్ల పెంపకం దారులలో,చికెన్ షాప్ యజ మానులలో అవగాహన తీసుకురావాలన్నారు. ఆయా గ్రామాల పరిధిలో శానిటైజేషన్ చేయించాలన్నారు.వైద్య ఆరోగ్యశాఖ అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
బయట నుంచి వచ్చిన వారు జిల్లాలో ఉండకూడదు నెల్లూరు: ఈనెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకే ఎన్నికల…
తిరుపతి: 4వ దశలో ఈనెల మే13 న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు & కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రశాంత…
అమరావతి: నాయకుడిగా తమకు బ్రతుకులను బాగా చేస్తాడని నమ్మి అధికారంలోకి తెచ్చిన ప్రజలను YSRCP మోసం చేసిందని నరేంద్ర మోదీ…
అమరావతి: ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ పార్టీ ఛైర్మన్గా ఉన్న శామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. భారతదేశంలో తూర్పున…
బస్సులు బయలుదేరు వివరాలు.. నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ విధులు కేటాయించబడిన పోలింగ్ అధికారులు,…
This website uses cookies.