AMARAVATHINATIONAL

సముద్ర నిఘా విమానాల కొనుగొలుకు రూ.29 వేల కొట్లతో ఒప్పందం

మేకిన్ ఇన్‌ ఇండియా..

అమరావతి: మేకిన్ ఇన్‌ ఇండియా ప్రాజెక్ట్ బాగంగా భారత నావికా దళానికి 9 సముద్ర నిఘా విమానాలు, కోస్ట్‌ గార్డ్‌ కు 6 గస్తీ విమానాలను కొనుగోలు చేసేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది.. 15 మారిటైమ్‌ పెట్రోల్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ లను,,C-295 రవాణా విమానాలను దేశీయంగా తయారు చేయనున్నారు.. ఈ ఒప్పందం విలువ మొత్తం రూ.29 వేలకోట్లు.. రక్షణ మంత్రిత్వ శాఖ కాన్పూర్‌కు చెందిన కంపెనీతో రూ.1752.13 కోట్లతో ఒప్పందం చేసుకున్నది..ఈ డీల్‌ కింద 12.7 MM రిమోట్‌ కంట్రోల్డ్‌ గన్స్‌ 463 కొనుగోలు చేయనున్నది.. ఈ గన్స్‌ ను నేవీతో పాటు కోస్ట్‌ గార్డ్‌ సిబ్బందికి అందించనున్నారు.. ఈ ఒప్పందాల  కారణంగా భారతదేశ సముద్రశక్తిని పెంచడంతో పాటు స్వావలంభన భారత్‌కు ప్రోత్సాహం అందిస్తాయని రక్షణశాఖ మంత్రిత్వ శాఖ వర్గాలు పేర్కొన్నాయి.. టాటా అడ్వాన్స్‌ డ్‌ సిస్టమ్స్‌,, ఎయిర్‌బస్‌ సంయుక్తంగా విమానాలను తయారు చేయనున్నారు..వీటిలో అత్యాధునిక రాడార్‌, సెన్సార్లు అమరుస్తారు.. హిందు మహాసముద్రంలో పాగా వేసేందుకు కంత్రీ చైనా ప్రయత్నిస్తున్నది..అదే సమయంలో అంతర్జాతీయ షిప్పింగ్‌ మార్గాలపై దాడులు పెరుగుతున్న నేపధ్యంలో ఇలాంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత నావికాదళం సామర్థ్యం నిరంతరం పెంచుకుంటున్నది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *