నెల్లూరు: టీడీపీ ప్రభుత్వ హయాంలో నిరుపేదల కోసం రూ. 2,260 కోట్లతో అత్యాధునిక షేర్వాల్ టెక్నాలజీతో నెల్లూరు నగరంలో 42వేల టిడ్కో గృహాలను నిర్మించామని,,దాదాపు నిర్మాణాలు పూర్తి చేసి పేదలకి తాళాలు ఇచ్చే సమయంలో ఎన్నికల కోడ్ రావడంతో వాటిని ఇవ్వలేకపోయామని మాజీ మంత్రి నారాయణ అన్నారు..ఆదివారం నగరం 3వ డివిజన్ పరిధిలో వేణుగోపాల్ నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించారు.ఈ సందర్బంలో అయన మాట్లాడుతూ ఆ తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లు అయినా నిరుపేదలకి ఇల్లు ఇవ్వకపోవడం దారుణమన్నారు.. టీడీపీ వాళ్లు నిర్మించారు కాబట్టి ఇప్పుడు ఇస్తే వాళ్లకి ఎక్కడ పేరు వస్తుందోనని వైసీపీ ఆలోచన చేయడం కరెక్ట్ కాదన్నారు.. రాజకీయమంటే ఇది కాదని వైసీపీ నాయకులకి ఆయన హితవు పలికారు. ప్రజా సమస్యలు తీర్చడం ప్రభుత్వం బాధ్యత అని తెలిపారు.ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు పనులు ఫేజ్ వన్ పూర్తయ్యాయని…టీడీపీ రాగానే వాటిని కూడా పూర్తి చేసి…నెల్లూరు నగర ప్రజలకే జిల్లా వాసులందరికి అందుబాటులోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ నాయకులు దెబ్బకి రియల్ ఎస్టేట్ వ్యాపారాలందరూ ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయారన్నారు. దీంతో ప్రభుత్వానికి ఆదాయం పడిపోయిందన్నారు. ఎప్పుడైతే ప్రభుత్వానికి ఆదాయం రాదో…డెవలప్ మెంట్, సంక్షేమం రెండూ ఆగిపోతాయన్నారు. అది చేయలేక ప్రజల మీద భారం మోపి…ట్యాక్స్ లు వేశారని విమర్శించారు. ఎమ్మెల్యేగా తనను,,ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని నారాయణ ప్రజల్ని కోరారు.
అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…
సీ.ఎస్, డీజీలకు నోటీసులు.. అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అనంతరం పలు చోట్ల చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భారత…
అమరావతి: 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ శాతం నమోదైంది..EVMల్లో నమోదైన ఓట్లు,, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు…
అమరావతి: భారత్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలపై ఇటీవల అమెరికా,, కెనడా దేశాలు మీడియా చేసిన అనుచిత వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి…
5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్…
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
This website uses cookies.