DISTRICTS

అమరావతికి మద్దతుగా సింహపురి వాణి రాష్ట్రమంతా వినిపించేలా సభ-సోమిరెడ్డి

నెల్లూరు: రాజధానిగా అమరావతి ఎంపిక ఏకగ్రీవ నిర్ణయం..అప్పట్లో సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రతిపాదిస్తే వైసీపీ, బీజేపీ, సీపీఎం, సీపీఐ నేతలు ఏకగ్రీవంగా మద్దతు తెలిపారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి అన్నారు. గురువారం జిల్లా కార్యాలయంలో రాజధాని అమరావతికి మద్దతుఃగా నెల్లూరులో ఈ నెల 14వ తేదిన ర్యాలీని నిర్వహించనున్నట్లు తెలియచేస్తు,ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అయన మాట్లాడుతూ అమరావతికి కేంద్రం కూడా ఓకే చెప్పింది. సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్రమోదీ శంకుస్థాపనకు విచ్చేశారు.ఈ రోజు కథలు చెబుతున్న జగన్ రెడ్డి ఆరోజే అమరావతిపై అభ్యంతరం తెలిపివుంటే రైతులు పొలాలిచ్చేవారు కాదన్నారు. జబర్దస్త్ రోజా విమానంలో విశాఖ వెళ్లి గర్జించివచ్చింది.. నగిరి ప్రజలకు అమరావతి దగ్గరా, విశాఖ దగ్గరా అంటూ ప్రశ్నించారు.భూమన కరుణాకర్ రెడ్డి ఎన్నికలకు ముందు అమరావతికి జైకొట్టి ఓట్లు వేయించుకున్నాడు..ఇప్పుడేమో విశాఖ అంటూ ర్యాలీలు చేస్తున్నారని మండిపడ్డారు.

నెల్లూరు జిల్లాలో దుర్మార్గాలు, అరాచకాలు, దోపిడీలు యథేచ్ఛగా జరిగిపోతున్నాయి.ఓ వైపు చలివేంద్రం భూములను అన్యాక్రాంతం చేసేస్తున్నారు..మరోవైపు రైతును దగా చేస్తున్నారు…ఇన్ని జరుగుతుంటే ఈ జిల్లాలో ఉండే మంత్రి ఏం చేస్తున్నాడో? సర్వేపల్లిలో మంత్రి కాకాణి వెయ్యి కోట్లకు పైగా ఆస్తులు సంపాదించినా ఆయనకీ ఆశ తగ్గక దోపిడీని కొనసాగిస్తున్నారు..జిల్లా వ్యాప్తంగా అదే పరిస్థితి కనిపిస్తోందని తీవ్రంగా విమర్శించారు. వాతావరణం అనుకూలిస్తే నవంబర్ 14న నెల్లూరులో జిల్లా స్థాయిలో భారీ ర్యాలీ, సభ నిర్వహించబోతున్నాం..వీఆర్సీ సెంటర్ నుంచి బయలుదేరి నర్తకీ సెంటర్ వరకు ర్యాలీ…అనంతరం అక్కడే ఎన్టీఆర్ విగ్రహం దగ్గర సభ పెట్టాలని నిర్ణయించామని,ఒక వేళ వర్షాలు మొదలైతే తగ్గిన తెల్లారే పెట్టేలా సన్నాహాలు చేస్తున్నామని వెల్లడించారు.14వ తేదీన జరగబోవు ర్యాలీలో ఏ పార్టీ అయినా పాల్గొనవచ్చని సామాన్య ప్రజలు కూడా పాల్గొనవచ్చని ఎవరు పాల్గొన్న స్వాగతిస్తామని తెలిపారు… కార్యక్రమంలో టీడీపీ నాయకులు అనురాధ, రమణయ్య, జాఫర్ షరీఫ్, శైలేంద్ర బాబు, రామ్మూర్తి, రాజా నాయుడు, సాబీర్ ఖాన్, సత్యనాగేశ్వర రావు, భువనేశ్వరి ప్రసాద్, జహీర్, కువ్వరపు బాలాజీ, తదితరులు పాల్గొన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

యువ‌త భ‌విష్యత్తే  మన రాష్ట్ర భవిష్య‌త్‌- డాక్ట‌ర్ పొంగూరు.నారాయణ

44 డివిజ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారం.. నెల్లూరు: యువ‌త భ‌విష్య‌త్తే...రాష్ట్ర భ‌విష్య‌త్ అని...మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు ఆలోచ‌న అని మాజీ…

17 hours ago

ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో చరిత్ర లిఖించిన భారతీయ ఆర్చర్లు

అమరావతి: ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…

18 hours ago

వైసీపీ మేనిఫెస్టో తేలిపోయిందా? ముఖ్యనేతల్లో తీవ్ర అసంతృప్తి

అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…

22 hours ago

పించన్లు ,ఇంటింటికి వెళ్లి ఇవ్వండి లేదంటే అకౌంట్ కు బదలీ చేయండి-ఈ.సీ

=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…

24 hours ago

స్పెషల్ డ్రైవ్ ద్వారా డ్రైను కాలువల పూడికతీత-MHO వెంకటరమణ

నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ్య నిర్వహణ పనుల్లో భాగంగా అన్ని డివిజన్లలో డ్రైను కాలువల పూడికతీతకు స్పెషల్…

24 hours ago

కరెంట్, ఆర్టీసీ,ఇంటి పన్నులు పెంచిన జగన్ దేనికి సిద్దంగా వున్నాడు?-బాలకృష్ణ

అమరావతి: దేశంలోనే 28 రాష్ట్రాలను వెనక్కు నెట్టి ఆంధ్రప్రదేశ్ ని అప్పులు, ఆత్మహత్యల్లో మొదటి స్థానానికి జగన్ తీసుకుని వచ్చారని…

2 days ago

This website uses cookies.