అమరావతి: దేశంలోనే 28 రాష్ట్రాలను వెనక్కు నెట్టి ఆంధ్రప్రదేశ్ ని అప్పులు, ఆత్మహత్యల్లో మొదటి స్థానానికి జగన్ తీసుకుని వచ్చారని ఎమ్మెల్యే బాలకృష్ణ మండిపడ్డారు.. శుక్రవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరులో నిర్వహిస్తున్న స్వర్ణాంధ్ర సాధికర సభలో బాలకృష్ణ పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడని ఆరోపించారు..పైకేమో నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటాడని,,లోపల ఎస్సీలని దారుణంగా చంపి డోర్ డెలివరీలు చేశారని ప్రొత్సహిస్తారని ఆరోపించారు.. రూ.1600 కోట్లతో రాష్ట్రమంతా సిద్ధం.. సిద్ధం.. అని హోర్డింగులు పెట్టుకున్నాడని,, దేనికి సిద్ధం కావాలి ? అంటూ ఎద్దేవా చేశారు.. జాబ్ క్యాలెండర్ ఎత్తేసి కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా, పరిశ్రమలన్నింటిని తరిమేసి, ఉన్న ఉద్యోగాలని కూడా పీకేశాడని మండిపడ్డారు.. కరెంట్, ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచేశారని, నిత్యవసర సరుకుల ధరలేమో ఆకాశాన్నంటుతున్నాయని అన్నారు..పోలవరం పూర్తిచేయక పోగా, గోదారిలో ముంచేశారంటూ దుయ్యబట్టారు.. విజయసాయి వైజాగ్లో రుషికొండలు తవ్వుకొంటూ నాశనం చేశారని, ఇప్పుడేమో నెల్లూరు వచ్చారనన్నారు.. మంత్రి కాకాణి కాకమ్మ కబుర్లు చెబుతుంటాడని,, ఆయన కళ్లు పడితే భూములన్నీ కబ్జాలే అని ఆరోపించారు.. అభివృద్ది కావాలా? అరాచకాలు కావాలా?, స్వర్ణయుగం కావాలా?.. రాతియుగం కావాలా?, సుపరిపాల కావాలా?.. రాక్షస పాలన కావాలా? సంక్షేమం కావాలా?… చీకటి రాజ్యం కావాలా?… అంటూ ఓటర్లను బాలకృష్ణ ప్రశ్నించారు.. ఈకార్యక్రమంలో నెల్లూరుసిటీ అభ్యర్ది పొంగూరు.నారాయణ,రూరల్ అభ్యర్ది శ్రీధర్ రెడ్డి,ఎం.పి అభ్యర్ది వేమిరెడ్డి.ప్రభాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
అమరావతి: విజయవాడలో ఎన్డీయే కూటమి అగ్రనేతల రోడ్షోకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహిని మధ్య బుధవారం మున్సిపల్ స్టేడియం…
బయట నుంచి వచ్చిన వారు జిల్లాలో ఉండకూడదు నెల్లూరు: ఈనెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకే ఎన్నికల…
తిరుపతి: 4వ దశలో ఈనెల మే13 న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు & కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రశాంత…
అమరావతి: నాయకుడిగా తమకు బ్రతుకులను బాగా చేస్తాడని నమ్మి అధికారంలోకి తెచ్చిన ప్రజలను YSRCP మోసం చేసిందని నరేంద్ర మోదీ…
అమరావతి: ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ పార్టీ ఛైర్మన్గా ఉన్న శామ్ పిట్రోడా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. భారతదేశంలో తూర్పున…
బస్సులు బయలుదేరు వివరాలు.. నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా మే 13న పోలింగ్ విధులు కేటాయించబడిన పోలింగ్ అధికారులు,…
This website uses cookies.