అమరావతి: రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం 78 రోజుల దీపావళి బోనస్ ను ప్రకటించింది.11.27 లక్షల మంది రైల్వే ఉద్యోగులకు మొత్తం రూ.1823 కోట్లను పండుగ బోనస్ గా చెల్లిస్తామని వెల్లడించింది.బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ విషయంపై నిర్ణయం తీసుకున్నట్లు సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ప్రభుత్వరంగంలోని మూడు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ ల నష్టాల భర్తీకి రూ.22 వేల కోట్ల ప్యాకేజీని ప్రకటించారు. 2020 జూన్ నుంచి 2022 జూన్ మధ్యకాలంలో ఎల్పీజీ గ్యాస్ ను మార్కెట్ ధర కంటే తక్కువకు ఆయిల్ కంపెనీలు విక్రయించిన సందర్భాల్లో జరిగిన నష్టాన్ని భర్తీ చేసేందుకు ఈ గ్రాంట్ ను వినియోగిస్తామని పేర్కొన్నారు. ఈ వ్యవధిలో ఎల్పీజీ ధరలు అంతర్జాతీయ మార్కెట్ లో దాదాపు 300 శాతం పెరిగాయని అనురాగ్ ఠాకూర్ గుర్తుచేశారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి రూ.600 కోట్ల ప్యాకేజీని ప్రకటించారు. “మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీల బిల్లు 2022”కు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసిందన్నారు. దీనివల్ల దేశంలో ఈజ్ ఆఫ్ బిజినెస్ డూయింగ్ కు ప్రోత్సాహం లభిస్తుందని పేర్కొన్నారు. మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీల్లో పారదర్శకతను పెంచేందుకు ఇది దోహదం చేస్తుందని వెల్లడించారు.
అవినీతిపరుల దగ్గర్నుంచి నల్లధనాన్ని కక్కిస్తాం.. అమరావతి: లోక్సభ ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తాం.. ఎన్నికలకు ముందే కాంగ్రెస్ చేతులు…
అమరావతి: రాష్ట్ర కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియామకమయ్యారు.. 1992 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన హరీష్ కుమార్ గుప్తాను…
అమరావతి: జార్ఖండ్ రాజధాని రాంచీలోని పలు ప్రాంతాల్లో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (E.D) అధికారులు సోమవారం వరుస దాడులు చేశారు..ఈ…
అమరావతి: జిల్లాలో సార్వత్రిక ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సజావుగా జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎం.హరి నారాయణన్ చెప్పారు. సోమవారం…
నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా…
This website uses cookies.