NATIONAL

కర్ణాటకలో IAS మరో IPS మహిళా అధికారిణిల మధ్య గొడవలు

అమరావతి: కర్ణాటకలో IAS మరో IPS మహిళా అధికారిణిల మధ్య స్పర్దలు, సోషల్ మీడియా వేదికగా బహిరంగమైయ్యాయి..ఇద్దరు హోదాను మరిచి వ్యక్తిగత ఆరోపణలకు దిగారు.. IPS అధికారిణి రూప మౌద్గిల్,, IAS అధికారిణి రోహిణి సింధూరిల మధ్య ఆరోపణల సంఘటన చోటు చేసుకుంది..

ఇద్దరు మహిళా అధికారుల గొడవ పై రాష్ట్ర హోంమంత్రి అరగ.జ్ఞానేంద్ర తీవ్రంగా స్పందిస్తూ ఇలాంటి వ్యక్తిగత దూషణలు మంచివి కావని, ఇద్దరు అధికారిణిలను హెచ్చరించారు..వారి ప్రవర్తన పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు..అధికారులు ఇద్దరూ నిబంధనలను ఉల్లంఘించారని,,ఇలాంటి ఘటనలు చూస్తూ రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉండలేదన్నారు..ఇద్దరు అధికారులు సాధారణ వ్యక్తుల బహిరంగంగా సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం మంచి పద్ధతి కాదన్నారు..ప్రజల్లో IAS,IPSల అంటే చాలా గౌరవం ఉంటుందని,,వీరిద్దరు ఒకరిపై ఒకరు చేసుకున్న ఆరోపణ వల్ల సివిల్ సర్వీస్ అధికారుల పట్ల ప్రజల్లో చులకన భావం ఏర్పాడుతుందన్నారు..దేశం కోసం, రాష్ట్రం కోసం ఎంతో మంది IAS,IPS అధికారులు కష్టపడి పని చేస్తూ ఉంటారని,,వీరిద్దరు ప్రవర్తన వల్ల అధికారులందరికీ చెడ్డపేరు వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు..ఈ విషయమై తాను రాష్ట్ర డిజీపీతోను,,చీఫ్ సెక్రటరీతో మాట్లాడానని తెలిపారు..గతంలో వీళ్లిద్దరి మధ్య విభేదాలు గురించి నా దృష్టికి వచ్చినప్పుడు వాళ్లకి నేను సర్ది చెప్పి చూశాను, అయిన వారు గొడవలు ఆపలేదని అన్నారు..వీరిద్దరిపై ఎలాంటి చర్యలు వుంటాయో వేచి చూడాలి మరి…?

2009 బ్యాచ్ కి చెందిన IAS అధికారిణి అయిన దాసరి.రోహిణి సింధూరి ముక్కు సూటిగా వ్యవహరిస్తారని పేరు వుంది..ప్రస్తుతం ఈమె కర్ణాటకలో మతం,స్వచ్ఛంద సంస్థ కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్నారు..IPS అధికారిణి D.రూప మౌద్గిల్.. రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు.. IAS అధికారిణి రోహిణి సింధూరి,,తన పట్ల అనుచితంగా ప్రవర్తించారని రూప ఆరోపిస్తూ,,రోహిణిపై వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేస్తూ,,కొంతమంది అధికారులతో ఉన్న ఫోటోలను రూప మౌద్గిల్, సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు..దీనిపై రోహిణి సింధూరి స్పందిస్తూ ఈ విషయం పై అధికారులకు ఫిర్యాదు చేస్తానని,,బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ వ్యక్తిగత ద్వేషంతో తనపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు..రూప మానసిక సమతుల్యత కోల్పోయి ఇలా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.

Spread the love
venkat seelam

Recent Posts

వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేష‌న్ దాఖ‌లు నరేంద్రమోదీ

అమరావతి: ప్ర‌ధాని దామోదర్ దాస్ న‌రేంద్ర మోదీ వార‌ణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేష‌న్ దాఖ‌లు చేశారు..వార‌ణాసి జిల్లా…

4 hours ago

ఎక్కడ రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదు-సీఈవో ముఖేష్ కుమార్ మీనా

అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…

19 hours ago

జిల్లాలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్-దాదాపు 75 శాతానికి పైగా పోలింగ్

నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…

19 hours ago

ఓటర్ల్లో పెరిగిన చైతన్యం-7 గంటలకే క్యూలైన్లు చేరుకున్న ఓటర్లు

3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…

1 day ago

ఓటు వేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

నెల్లూరు: సోమవారం ఓటు వేయడానికి బయటకు వెళ్లేటప్పుడు ఎవరూ వారి మొబైల్‌ని తీసుకెళ్లకూడదు.1) ఓటింగ్ బూత్‌లలో మొబైల్ ఫోన్‌లను తీసుకెళ్లడంపై…

2 days ago

రాష్ట్ర భవిష్యత్ నిర్ణయాధికారాన్ని అప్పగించేందుకు ఓటర్లు సిద్దం..

96 లోక్‌సభ స్థానాలు.. అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో నాలుగో దశ పోలింగ్‌, ఆంధ్రప్రదేశ్ కు చాలా కీలకమైంది..సోమవారం జరగనున్న ఈ…

2 days ago

This website uses cookies.