నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని ప్రజల సమస్యల పరిష్కారానికి రూపొందించిన స్పందన వేదికలో అందుకున్న ఫిర్యాదులను కమిషనర్ వికాస్ మర్మత్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. స్థానిక 21 వ డివిజను మాగుంట లే అవుట్ ప్రాంతంలో టౌన్ ప్లానింగ్ అధికారులతో కమిషనర్ స్పందన ఫిర్యాదును శుక్రవారం ప్రత్యక్షంగా పరిశీలించి అధికారులకు వివిధ సూచనలు జారీ చేశారు. నగర పాలక సంస్థ సూచించిన నిబంధనల మేరకు భవన నిర్మాణాలు జరిగేలా టౌన్ ప్లానింగ్ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కమిషనర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు దశయ్య, ప్రవీణ్, సిబ్బంది, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.అనంతరం మరో స్పందన ఫిర్యాదు పరిష్కారానికి స్థానిక 42 వ డివిజన్ కోటమిట్ట ప్రాంతంలో డ్రైను కాలువ సమస్యను కమిషనర్ ప్రత్యక్షంగా పరిశీలించారు. స్థానికంగా డ్రైను కాలువల మరమ్మతు పనులను పూర్తి చేసి సమస్యను పునరావృతం కాకుండా పర్యవేక్షించాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ విభాగం అధికారులు సంజయ్, సురేష్, సాయి కృష్ణ, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు..ఈ పిటిషన్పై జస్టిస్…
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
This website uses cookies.