స్పందన ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన కమిషనర్ వికాస్
నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని ప్రజల సమస్యల పరిష్కారానికి రూపొందించిన స్పందన వేదికలో అందుకున్న ఫిర్యాదులను కమిషనర్ వికాస్ మర్మత్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. స్థానిక 21 వ డివిజను మాగుంట లే అవుట్ ప్రాంతంలో టౌన్ ప్లానింగ్ అధికారులతో కమిషనర్ స్పందన ఫిర్యాదును శుక్రవారం ప్రత్యక్షంగా పరిశీలించి అధికారులకు వివిధ సూచనలు జారీ చేశారు. నగర పాలక సంస్థ సూచించిన నిబంధనల మేరకు భవన నిర్మాణాలు జరిగేలా టౌన్ ప్లానింగ్ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కమిషనర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ అధికారులు దశయ్య, ప్రవీణ్, సిబ్బంది, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.అనంతరం మరో స్పందన ఫిర్యాదు పరిష్కారానికి స్థానిక 42 వ డివిజన్ కోటమిట్ట ప్రాంతంలో డ్రైను కాలువ సమస్యను కమిషనర్ ప్రత్యక్షంగా పరిశీలించారు. స్థానికంగా డ్రైను కాలువల మరమ్మతు పనులను పూర్తి చేసి సమస్యను పునరావృతం కాకుండా పర్యవేక్షించాలని అధికారులను కమిషనర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ విభాగం అధికారులు సంజయ్, సురేష్, సాయి కృష్ణ, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.