AMARAVATHI

డ్రోన్ ఫ్లై రీ సర్వే ప్రారంభించిన కమిషనర్ వికాస్ మర్మత్

నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజనుల్లో జరగనున్న రీ సర్వే పనులలో అత్యాధునిక డిజిటల్  డ్రోన్ సేవలను వినియోగించుకుని రీ సర్వేను త్వరితగతిన పూర్తి చేయాలని నగర పాలక సంస్థ కమిషనర్ వికాస్ మర్మత్ అధికారులను ఆదేశించారు.నగర పాలక సంస్థ పట్టణ ప్రణాళికా విభాగం అధికారులు, డ్రోన్ ఏజెన్సీ బృందంతో స్థానిక పోలీసు పెరేడు మైదానంలో డ్రోన్ ఫ్లై రీ సర్వేను కమిషనర్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నేటినుంచి జరగనున్న డ్రోన్ ఫ్లై భూసర్వే లో నగర పాలక సంస్థ పరిధిలో 154 చ.కిమీ మేరకు రీ సర్వే చేయనున్నామని తెలిపారు. నగర పాలక సంస్థ పరిధిలో ఆస్తి కలిగిన ప్రతిఒక్కరికీ రీ సర్వే ఆధారిత శాశ్వత భూహక్కు పత్రాలను అందజేస్తామని, భవిష్యత్తులో ఆస్థి క్రయవిక్రయాలను సులభతరం చేసేందుకు ఆయా పత్రాలు ఉపయుక్తంగా ఉంటాయని తెలిపారు. అక్టోబర్ నెల వరకు జరగనున్న సమగ్ర భూహక్కు రీ సర్వే కార్యక్రమానికి నగర ప్రజలంతా సహకరించేలా అధికారులు, కార్యదర్శులు అవగాహన కల్పించాలని కమిషనర్ సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ చెన్నుడు, టౌన్ ప్లానింగ్ అధికారులు, సర్వేయర్లు, రీ సర్వే తహశీల్దార్, సచివాలయాల వార్డు ప్లానింగ్ కార్యదర్శులు, డ్రోన్ ఏజెన్సీ నిర్వాహకులు కృష్ణ చైతన్య, సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

భారత వాయుసేనకు చెందిన వాహనంపై ఉగ్రవాదుల దాడులు

అమరావతి: జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…

19 hours ago

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్,రాబోయే రోజుల్లో ఈ చట్టం గొప్ప సంస్కరణ అవుతుంది-వైసీపీ అధినేత జగన్

నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…

20 hours ago

అభ్యర్థులకు ఓటర్ల జాబితా పంపిణీ చేసిన వికాస్ మర్మత్

నెల్లూరు: ఎన్నికల సంఘం ఆదేశములతో, జిల్లా ఎన్నికల అధికారి సూచనల మేరకు 117- నెల్లూరు నగర  అసెంబ్లీ నియోజకవర్గం ఏప్రిల్…

23 hours ago

పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వినియోగించుకోనున్న20 వేల మందికి పైగా ఉద్యోగులు-కలెక్టర్

నెల్లూరు: భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల విధుల్లో ఉండే ప్రభుత్వ ఉద్యోగులందరూ వారి నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన…

23 hours ago

బంగారం స్మగ్లింగ్‌ చేస్తూ కస్టమ్స్‌ అదికారులకు అడ్డంగా ఆఫ్ఘనిస్థాన్ అంబాసిడర్

అమరావతి: అత్యున్నత పదవిలో ఉన్న ఓ మహిళ అధికారిణి బంగారం స్మగ్లింగ్‌ చేస్తూ కస్టమ్స్‌ అదికారులకు అడ్డంగా దొరికిపోయి,, అంబాసిడర్…

24 hours ago

వైసీపీని బంగళాఖతంలో కలిపేందుకు సింహపురి ప్రజలు సిద్దమేనా-బాబు,పవన్

నెల్లూరు: చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ల బహిరంగ సభ నెల్లూరులో విజయవంతంగా జరిగింది.నగరంలోని కే.వి.ఆర్ పెట్రోల్ బంకు వద్ద నుంచి ర్యాలీగా…

2 days ago

This website uses cookies.