DISTRICTS

ప్రభుత్వ ఉద్యోగుల ఆదాయ పన్ను చెల్లింపుల్లో D.D.O.లదే పూర్తి బాధ్యత-శ్రీనివాస్

నెల్లూరు: ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఆదాయ పన్ను చెల్లింపుల్లో ఆయా శాఖల D.D.O.లదే పూర్తి బాధ్యత అని  విజయవాడ ఆదాయ పన్ను శాఖ అదనపు కమిషనర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణంలో ఆదాయ పన్నుకు సంబంధించి ఉద్యోగులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఉద్యోగులకు సంబంధించి ఆదాయ పన్ను చెల్లింపు వ్యవహారాల్లో D.D.O లు అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు ఆదాయ పన్ను వివరాలను పరిశీలిస్తూ ఎటువంటి లోటుపాట్లు లేకుండా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఫిబ్రవరిలో ఉద్యోగులకు సంబంధించిన ఇన్కమ్ టాక్స్ బిల్లులను అప్లోడ్ చేయాలన్నారు. గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఆదాయపన్ను  చెల్లింపునకు సంబంధించి పాత విధానం, కొత్త విధానం రెండూ అమలులో ఉన్నాయని, ఉద్యోగులు వారికి లాభదాయకమైన విధానంలో పన్ను చెల్లించాలని సూచించారు. D.D.O లు వారి యొక్క TAN నెంబర్ తెలుసుకుని ఉండాలని, ఇన్కమ్ టాక్స్ లాగిన్ ఐడి, పాస్వర్డ్ తో ప్రతినెలా ఉపయోగిస్తూ, అవసరమైతే పాస్వర్డ్ మార్చుకోవాలని సూచించారు. ఉద్యోగుల వ్యక్తిగత ఈమెయిల్, మొబైల్ నెంబర్ నే ఆదాయ పన్ను చెల్లింపులో నమోదు చేయాలని పేర్కొన్నారు. జిల్లాలో అన్ని ప్రభుత్వ విభాగాల D.D.Oలతో ఒక ప్రత్యేక వాట్సాప్ గ్రూపును రూపొందించి, ఆదాయపన్ను చెల్లింపులకు సంబంధించి అన్ని సందేహాలను నివృత్తి చేసేలా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో తిరుపతి ఆదాయ పన్ను శాఖ అధికారి ఎస్ రాజశేఖర్, జిల్లా ఖజానా కార్యాలయం డిప్యూటీ డైరెక్టర్ గంగాధర్, ఏటిఓ లోకేష్ బాబు, ఎస్టిఓ రహమాన్, డిడివోలు, పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

అవ‌స‌ర‌మైనంత కాలం రిజ‌ర్వేష‌న్లు కొన‌సాగించాల్సిందే- మోహన్ భగవత్

అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…

15 hours ago

కేంద్ర ఎన్నికల పరిశీలకుల సమక్షంలో రెండో విడత మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ ర్యాండమైజేషన్

నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…

15 hours ago

యువ‌త భ‌విష్యత్తే  మన రాష్ట్ర భవిష్య‌త్‌- డాక్ట‌ర్ పొంగూరు.నారాయణ

44 డివిజ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారం.. నెల్లూరు: యువ‌త భ‌విష్య‌త్తే...రాష్ట్ర భ‌విష్య‌త్ అని...మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు ఆలోచ‌న అని మాజీ…

2 days ago

ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో చరిత్ర లిఖించిన భారతీయ ఆర్చర్లు

అమరావతి: ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…

2 days ago

వైసీపీ మేనిఫెస్టో తేలిపోయిందా? ముఖ్యనేతల్లో తీవ్ర అసంతృప్తి

అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…

2 days ago

పించన్లు ,ఇంటింటికి వెళ్లి ఇవ్వండి లేదంటే అకౌంట్ కు బదలీ చేయండి-ఈ.సీ

=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…

2 days ago

This website uses cookies.