అంతర్జాతీయ బాలికా దినోత్సవ..
నెల్లూరు: బాలికల అభివృద్ధికి విద్యను మించిన మార్గం లేదని, అందుకే బాలికలు విద్యావంతులై జీవితంలో సాధికారతను సాధించి ఉన్నత స్థాయికి ఎదిగే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ, నెల్లూరు – ప్రకాశం జిల్లాల క్షేత్ర ప్రచార అధికారి పరవస్తు నాగసాయి సూరి తెలిపారు. బేటీ బచావ్ – బేటీ పడావ్, సుకన్య సమృద్ధి యోజన పథకాల ఉద్దేశం ఇదేనన్న ఆయన, చదువుకుని మంచి మార్కులు తెచ్చుకున్న వారికి అనేక కేంద్ర ప్రభుత్వ పథకాలు అండగా ఉన్నాయని తెలిపారు. అక్టోబర్ 11న అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో, నెల్లూరులోని శ్రీ కస్తూరి దేవీ బాలికోన్నత పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీ కస్తూరి దేవి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు వనజ మాట్లాడుతూ, తాము కూడా చిన్న వయసులో ఇప్పటి కంటే అనేక రకాల సమస్యలను, సమాజంలో వేళ్ళూనుకున్న వివక్షలను అధిగమించటం వల్లే ఈ స్థాయికి చేరుకున్నామని తెలిపారు. మనం భయపడితే సమస్యలు మనల్ని భయపెడతాయని, ఎదిరించి ఆత్మస్థైర్యంతో నిలబడితే జీవితంలో ఏదైనా సాధించగలమని తెలిపారు.
నెల్లూరు: జగన్ పాలనలో రాష్ట్రం అంతా మాఫియా కమ్ముకున్నదని,,ఇసుక మాఫియా, మట్టి మాఫియా, మద్యం మాఫియా లాగా తయారు అయ్యి…
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో గూండాగిరీని అంతం చేసేందుకే టీడీపీ, జనసేన పార్టీతో కలిసి కూటమిగా ఏర్పడ్డామని బీజేపీనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా…
అమరావతిం ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి,,ఎన్నికల వేళ విధులు సక్రమంగా నిర్వర్తించడం లేదంటూ ఆయన ఎలక్షన్స్ కమీషన్ బదిలీ వేటు…
నెల్లూరు: భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పోలింగ్ విధులు కేటాయించబడిన ప్రభుత్వ ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ…
అమరావతి: జమ్మూకశ్మీర్లోని పూంచ్ జిల్లా శశిధర్ ప్రాంతంలో శనివారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు..భారత వాయుసేన (IAF)కు చెందిన వాహనంపై…
నెల్లూరు: చంద్రబాబు గతంలో కూటమి పేరుతో ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నేరవేర్చలేదు,,మళ్లీ ఈ ముగ్గురు…
This website uses cookies.