నెల్లూరు: సఫాయీ మిత్ర సురక్షా ఛాలెంజ్ పధకం అమలులో భాగంగా దేశ వ్యాప్తంగా మున్సిపల్, కార్పొరేషన్ కార్మికుల రక్షణకై కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను తప్పనిసరిగా అమలు చేయాలని నగర పాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత ఆదేశించారు. గురువారం భూగర్భ డ్రైను కార్మికులు, డీ స్లెడ్జింగ్ ఆపరేటర్లకు అందుతున్న వివిధ రక్షణా ఉపకరణాలు, సౌకర్యాల గురించి ఇంజనీరింగ్ విభాగం అధికారులతో సమీక్షా సమావేశాన్ని కమిషనర్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ విధి నిర్వహణలో నగర పాలక సంస్థ అందించిన యూనిఫామ్, చేతి తొడుగులు, హెల్మెట్, షూస్, మాస్క్ లను తప్పనిసరిగా ప్రతీ కార్మికుడు వినియోగించేలా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రమాదాల నివారణకై వారికి అవగాహన కల్పించాలని సూచించారు. భూగర్భ డ్రైను పనులలో భాగంగా మ్యాన్ హోల్స్ శుభ్రతకై యంత్రాలను మాత్రమే వినియోగించాలని అదేశించారు. ప్రభుత్వం సూచించిన అన్ని రక్షణా నిబంధనలను పాటిస్తూ, స్వచ్ఛ సర్వేక్షన్ పోటీలో ఉత్తమ ర్యాంకు సాధించేందుకు కృషి చేయాలని కమిషనర్ అధికారులను కోరారు. ఈ సమావేశంలో ఎస్.ఈ సంపత్ కుమార్, ఈ.ఈలు సంజయ్, చంద్రయ్య, ఏ.ఈ మాధవి పాల్గొన్నారు.
5 మంది మృతి,20 మందికి గాయాలు.. అమరావతి: 13వ తేదిన రాష్ట్రంలో ఓటు వేసేందుకు సొంతూరు వచ్చి,తిరిగి ప్రవేట్ ట్రావెల్స్…
38 శాతం.. అమరావతి: 2024 సార్వత్రి ఎన్నికల్లో భాగంగా 4వ ఫేజ్ లో శ్రీనగర్ లోకసభకు జరిగిన ఎన్నికల్లో ఓటర్లు…
అమరావతి: ప్రధాని దామోదర్ దాస్ నరేంద్ర మోదీ వారణాసిలో మంగళవారం వారణాసి పార్లమెంట్ అభ్యర్దిగా నామినేషన్ దాఖలు చేశారు..వారణాసి జిల్లా…
అమరావతి: సమస్యలు వచ్చిన ఈవీఎంలను వెంటనే మార్చేయడం జరిగిందని,,ఓటర్ల నమోదు ముందుగా చేపట్టడంతో పెద్ద సంఖ్యలో పోలింగ్ నమోదైందని రాష్టా…
నెల్లూరు: సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ జిల్లాలో ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో సోమవారం ఉదయం…
3 గంటలకు 58 శాతం.. నెల్లూరు: జిల్లా వ్యాప్తంగా సోమావారం ఉదయం 7 గంటలకు సార్వత్రికల ఎన్నికల్లో బాగంగా ఓటర్లు…
This website uses cookies.