DISTRICTS

సఫాయీ మిత్ర సురక్ష నిబంధనల అమలు తప్పనిసరి-కమిషనర్ శ్రీమతి హరిత

నెల్లూరు: సఫాయీ మిత్ర సురక్షా ఛాలెంజ్ పధకం అమలులో భాగంగా దేశ వ్యాప్తంగా మున్సిపల్, కార్పొరేషన్ కార్మికుల రక్షణకై కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలను తప్పనిసరిగా అమలు చేయాలని నగర పాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత ఆదేశించారు. గురువారం భూగర్భ డ్రైను కార్మికులు, డీ స్లెడ్జింగ్ ఆపరేటర్లకు  అందుతున్న వివిధ రక్షణా ఉపకరణాలు, సౌకర్యాల గురించి ఇంజనీరింగ్ విభాగం అధికారులతో సమీక్షా సమావేశాన్ని కమిషనర్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ విధి నిర్వహణలో నగర పాలక సంస్థ అందించిన యూనిఫామ్, చేతి తొడుగులు, హెల్మెట్, షూస్, మాస్క్ లను తప్పనిసరిగా ప్రతీ కార్మికుడు వినియోగించేలా  జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రమాదాల నివారణకై వారికి అవగాహన కల్పించాలని సూచించారు. భూగర్భ డ్రైను పనులలో భాగంగా మ్యాన్ హోల్స్ శుభ్రతకై యంత్రాలను మాత్రమే వినియోగించాలని అదేశించారు. ప్రభుత్వం సూచించిన అన్ని రక్షణా నిబంధనలను పాటిస్తూ, స్వచ్ఛ సర్వేక్షన్ పోటీలో ఉత్తమ ర్యాంకు సాధించేందుకు కృషి చేయాలని కమిషనర్ అధికారులను కోరారు. ఈ సమావేశంలో ఎస్.ఈ సంపత్ కుమార్, ఈ.ఈలు సంజయ్, చంద్రయ్య, ఏ.ఈ మాధవి పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *