DISTRICTS

ఆత్మకూరు నియోజకవర్గంలో సోమశిల డ్యాం వున్నప్పటికి ఇప్పటికి మెట్ట భూములు? జనసేన-శ్రీధర్

నెల్లూరు: దాదాపు 80 టీ.ఎం.సీల నీటి నిల్వ సామర్థ్యం ఉన్న రిజర్వాయర్లు ఆత్మకూరు నియోజకవర్గంలో ఉన్నప్పటికీ నియోజకవర్గంలో ఎక్కువ భాగం భూములు మెట్ట భూములుగానే ఉండడానికి కారణం ఏమిటంటూ జనసేన ఆత్మకూరు నియోజకవర్గ ఇన్చార్జ్ నలిశెట్టి.శ్రీధర్ ప్రశ్నించారు.గురువారం 12వ రోజు పవనన్న ప్రజా బాట కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని జ్యోతి నగర్ మరియు వీవర్స్ కాలనీలో పర్యటించిన సందర్బంగా అయన మీడియాతో మాట్లాడుతూ ఆత్మకూరు నియోజకవర్గంలోనే సోమశిల జలాశయం ఉన్నప్పటికీ, నియోజకవర్గంలోని అన్ని చెరువులకు సాగునీటి సౌకర్యం కల్పించేది ఎప్పుడు అంటు పాలకులను నిలదీశారు. సోమశిల జలాశయం నుంచి పక్క రాష్ట్రమైన తమిళనాడుకు,, చిత్తూరు, ప్రకాశం జిల్లాలకు,,నెల్లూరు జిల్లాలోని తూర్పు ప్రాంతానికి సాగు,తాగు నీటి వసతులు కల్పించరన్నారు.అయితే నియోజకవర్గంలోని సింహభాగం భూములకు ఇప్పటికీ సాగునీరు లభించేందుకు ఎటువంటి ప్రణాళికలు రూపొందించలేదని,, రూపొందించిన వాటికి నిధులను మంజూరు చేయని కారణంగా అవి మూలనపడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మకూరు నియోజకవర్గంలోని అన్ని చెరువులకు,, గ్రామాలకు సాగు,తాగు నీటి సదుపాయాలు కల్పించాలంటే నియోజకవర్గ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి గల జనసేన పార్టీకే మద్దతు ఇవ్వలని అభ్యర్దించారు.మునిసిపాలిటీ పరిధిలో పలు ప్రాంతాల్లో ప్రజల ఇబ్బందులు తెలుసుకుని, వాటి పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వంశీ, చంద్ర, సురేష్,చైతన్య, పవన్, వెంకటేష్ ,హజరత్, నాగరాజా,సునీల్,అనిల్,భాను తదితరులు పాల్గొన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

అవ‌స‌ర‌మైనంత కాలం రిజ‌ర్వేష‌న్లు కొన‌సాగించాల్సిందే- మోహన్ భగవత్

అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…

21 hours ago

కేంద్ర ఎన్నికల పరిశీలకుల సమక్షంలో రెండో విడత మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ ర్యాండమైజేషన్

నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…

21 hours ago

యువ‌త భ‌విష్యత్తే  మన రాష్ట్ర భవిష్య‌త్‌- డాక్ట‌ర్ పొంగూరు.నారాయణ

44 డివిజ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారం.. నెల్లూరు: యువ‌త భ‌విష్య‌త్తే...రాష్ట్ర భ‌విష్య‌త్ అని...మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు ఆలోచ‌న అని మాజీ…

2 days ago

ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో చరిత్ర లిఖించిన భారతీయ ఆర్చర్లు

అమరావతి: ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…

2 days ago

వైసీపీ మేనిఫెస్టో తేలిపోయిందా? ముఖ్యనేతల్లో తీవ్ర అసంతృప్తి

అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…

2 days ago

పించన్లు ,ఇంటింటికి వెళ్లి ఇవ్వండి లేదంటే అకౌంట్ కు బదలీ చేయండి-ఈ.సీ

=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…

2 days ago

This website uses cookies.