DISTRICTS

రీ సర్వేలో అనధికార స్థలాలు గుర్తించండి-కమిషనర్ హరిత

నెల్లూరు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పధకంలో భాగంగా నగర వ్యాప్తంగా జరగనున్న రీ సర్వేలో అనధికార స్థలాలు గుర్తించి, వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సచివాలయం వార్డు ప్లానింగ్ & రెగులేషన్ కార్యదర్శులను నగర పాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత ఆదేశించారు. స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో రీ సర్వే 4వ రోజు శిక్షణ తరగతులకు కమిషనర్ గురువారం హాజరై సమీక్షించారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ త్వరలో ప్రారంభం కానున్న రీ సర్వే ప్రక్రియతో నగరంలోని అనధికార లే అవుట్లు, భవనాలను గుర్తించి కార్పొరేషన్ దృష్టికి తీసుకురావాలని సూచించారు. L.R.S పధకం యజమానుల వివరాలను సంబంధిత అధికారులకు నివేదించడంతో పాటు అనుమతులు మంజూరులేని లేఅవుట్ల యజమానులకు అవసరమైన పత్రాలను సమర్పించి, దరఖాస్తులు పూర్తి చేయాలని సూచించారు. ఈ ఏడాది అక్టోబర్ 31 లోపు L.R.S పధకంలో అన్ని పాటర్న్స్, అప్లికేషన్ లను పూర్తి చేయాలని కమిషనర్ ఆదేశించారు. అదేవిధంగా రోడ్డు మార్జిన్ ఆక్రమణలు, ప్రకటనలు, అక్రమ నిర్మాణాలను గుర్తించి సంబంధిత అధికారులకు సమాచారం అందించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు, సర్వేయర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

నా కుమారై, నన్ను వ్యతిరేకించడమా ? ముద్రగడ పద్మనాభరెడ్డి

అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురంలో కచ్చితంగా ఓడిపోతారని, ఆయనను ఓడించి పంపకపోతే తన పేరు మార్చుకుంటానని ముద్రగడ…

1 hour ago

వయనాడ్‌లో ఓడిపోతే ? రాయ్‌బరేలి నుంచి బరిలోకి దిగిన రాహుల్‌ గాంధీ

అమరావతి: కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలు అయిన ఉత్తరప్రదేశ్‌లోని అమేథి, రాయ్‌బరేలి స్థానాల నుంచి పోటీ చేసే కాంగ్రెస్‌ అభ్యర్థులపై కొనసాగుతున్న…

2 hours ago

వైసీపీ ఎం.పీలు,ఎమ్మేల్యేలు జగన్ కాలి క్రింద చెప్పులే-అంబటి

అమరావతి: వైసీపీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7 నెలలు తిరిగాను అని,,ఆ సమయంలో నేను గమనించింది.అ పార్టీలో వుంటే ప్రజాసేవా…

20 hours ago

122 సంవత్సరాల తరువాత తొలిసారిగా ఏప్రిల్‌ ఉష్ణోగ్రతలు

అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్‌ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్‌లో వడగాలులు…

1 day ago

దక్షిణ చైనాలో కుప్పకూలిన వంతెనలో కొంత భాగం-19 మంది మృతి

అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్‌డాంగ్‌ ప్రావిన్స్‌ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…

2 days ago

నెల్లూరు పార్లమెంటుకు 14 మంది-అసెంబ్లీలకు 115 మంది అభ్యర్థులు-కలెక్టర్‌

మే 2 నుంచి ప్రతి ఇంటికి ఓటరు స్లిప్పులు.. నెల్లూరు: 2024 సాధారణ ఎన్నికల ప్రక్రియలో ప్రధానఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ…

3 days ago

This website uses cookies.