అమరావతి: అమెరికాలోని న్యూయర్క్ లో కత్తిదాడిలో తీవ్రంగా గాయపడిన ప్రాణాపాయ స్థితిలో వున్న భారత సంతతికి చెందిన వివాదస్పద రచయిత సల్మాన్ రష్దీ ఆరోగ్య పరిస్థితులపై తీవ్ర ఆందోళన నెలకొంది..శుక్రవారం రాత్రి న్యూయర్క్ లోని ఓ ఇనిస్టిట్యూట్ లో ప్రసంగించేందుకు సిద్ధమవుతుండగా ఓ యువకుడు రష్దీపైకి దూసుకొచ్చి కత్తితో విచక్షణ రహితంగా చేశాడు..ఒక్కసారిగా జరిగిన దాడితో రష్దీ, స్టేజీపై కూలిపోయారు..తక్షణమే ఆయన్ను హెలికాప్టర్ లో ఆసుపత్రికి తరలించారు..శస్త్రచికిత్స తరువాత వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న ఆయనకు ఒక కన్ను పూర్తిగా చూపు కోల్పోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది..కత్తితో తీవ్రంగా పొడవడం వల్ల భుజంపై నరాలు తెగిపోయాయని, లివర్ కూడా దెబ్బతినట్లు వైద్యులు చెబుతున్నారు..ఓ వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం,,ప్రస్తుతం సల్మాన్ రష్దీ ఆరోగ్యం విషమంగానే ఉందని,,ఏమి మాట్లాడలేకపోతున్నారని పేర్కొంది..శాశ్వతంగా ఓ కన్ను కోల్పోవచ్చనే సంకేతాలు వైద్యులు, రష్దీకి చెందిన సన్నిహితుల నుంచి వస్తున్నాయని ఆవార్తా సంస్థ పేర్కొంది..కత్తితో దాడిచేసిన వ్యక్తిని న్యూజెర్సీలోని ఫెయిర్ వ్యూకు చెందిన హదీ మాటర్(24) గా న్యూయర్క్ పోలీసులు గుర్తించారు.ఈదాడిలో ఇంకా ఎవరున్నారనే విషయంపై పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు..
నెల్లూరు: చంద్రబాబు,పవన్ కళ్యాణ్ ల బహిరంగ సభ నెల్లూరులో విజయవంతంగా జరిగింది.నగరంలోని కే.వి.ఆర్ పెట్రోల్ బంకు వద్ద నుంచి ర్యాలీగా…
అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురంలో కచ్చితంగా ఓడిపోతారని, ఆయనను ఓడించి పంపకపోతే తన పేరు మార్చుకుంటానని ముద్రగడ…
అమరావతి: కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలు అయిన ఉత్తరప్రదేశ్లోని అమేథి, రాయ్బరేలి స్థానాల నుంచి పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థులపై కొనసాగుతున్న…
అమరావతి: వైసీపీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా 7 నెలలు తిరిగాను అని,,ఆ సమయంలో నేను గమనించింది.అ పార్టీలో వుంటే ప్రజాసేవా…
అమరావతి: 1901 తరువాత తొలిసారిగా ఏప్రిల్ ఉష్ణోగ్రతలు ఈ స్థాయిలో నమోదు అయ్యాయి.. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఏప్రిల్లో వడగాలులు…
అమరావతి: దక్షిణ చైనాలో గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ లోని ఓ హైవేపై రోడ్డు కొంత భాగం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో సుమారు 19…
This website uses cookies.