NATIONAL

కామన్ వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించి,యువతకు స్పూర్తినిచ్చారు-ప్రధాని మోదీ

అమరావతి: బర్మింగ్ హామ్ లో జరిగిన కామన్ వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ శుక్రవారం ఢిల్లీలోని ప్రధానమంత్రి అధికారిక నివాసంలో సమావేశం అయ్యారు..ఈకార్యక్రమంలో కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, కేంద్ర క్రీడల శాఖ సహాయ మంత్రి నిషిత్ ప్రమాణిక్ పాల్గొన్నారు..కామన్ వెల్త్ గేమ్స్ విజేతలతో ముచ్చటించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ,,క్రీడాకారుల అనుభవాలను తెలుసుకున్నారు.. ఈ సందర్భంలో విజేతలైన క్రీడాకారులను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ,,కామన్ వెల్త్ క్రీడల ప్రారంభానికి ముందే తాను చెప్పానని,,బర్మింగ్ హోమ్ నుంచి తిరిగి వచ్చిన తరువాత విజయోత్సవం జరుపుకుంటామని,,చెప్పిన మాట ప్రకారం క్రీడాకారులు విజయంతో తిరిగి రావడం ఎంతో సంతోషించే విషయమన్నారు..ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకల వేళ బిజిగా ఉన్నప్పటికి.. విజేతలందరినీ కలుసుకోవాలనుకున్నానని,, క్రీడాకారుల స్ఫూర్తిదాయక ప్రదర్శనను ప్రధాని నరేంద్రమోదీ అభినందించారు.. కామన్ వెల్త్ గేమ్స్ లో చారిత్రాత్మక ప్రదర్శనతో పాటు,,భారత్ తొలిసారి చెస్ ఒలింపియాడ్ ను దేశంలో నిర్వహించుకోవడం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు..కామన్ వెల్త్ క్రీడలతో పాటు చెస్ ఒలింపియాడ్ లోనూ దేశం పతకాలు సాధించిన క్షణాలు ఎంతో ఆనందాన్ని కలిగించాయన్నారు..చెస్ ఒలింపియాడ్ విజేతకు ప్రధాని నరేంద్రమోదీ మరోసారి అభినందనలు తెలిపారు..కామన్ వెల్త్ క్రీడల్లో 22 బంగారు, 16 రజత, 23 కాంస్య పతకాలతో మొత్తం 61 పతకాలను సాధించిన భారత్ పతకాల పట్టికలో 4వ స్థానంలో నిలిచింది..

Spread the love
venkat seelam

Recent Posts

అవ‌స‌ర‌మైనంత కాలం రిజ‌ర్వేష‌న్లు కొన‌సాగించాల్సిందే- మోహన్ భగవత్

అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…

35 mins ago

కేంద్ర ఎన్నికల పరిశీలకుల సమక్షంలో రెండో విడత మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ ర్యాండమైజేషన్

నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…

1 hour ago

యువ‌త భ‌విష్యత్తే  మన రాష్ట్ర భవిష్య‌త్‌- డాక్ట‌ర్ పొంగూరు.నారాయణ

44 డివిజ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారం.. నెల్లూరు: యువ‌త భ‌విష్య‌త్తే...రాష్ట్ర భ‌విష్య‌త్ అని...మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు ఆలోచ‌న అని మాజీ…

23 hours ago

ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో చరిత్ర లిఖించిన భారతీయ ఆర్చర్లు

అమరావతి: ఆర్చరీ వరల్డ్‌ కప్-2024లో భారత్ చరిత్ర సృష్టించింది..శనివారం షాంఘైలో జరిగిన ఈ టోర్నీలో భారత్ తొలిసారి హ్యాట్రిక్ గోల్డ్…

24 hours ago

వైసీపీ మేనిఫెస్టో తేలిపోయిందా? ముఖ్యనేతల్లో తీవ్ర అసంతృప్తి

అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్ శనివారం మేనిఫెస్టో విడుదల చేశారు.కేవలం చేయగలిగినవి మాత్రమే చెబుతున్నామంటూ రెండు పేజీలతోనే మేనిఫెస్టో…

1 day ago

పించన్లు ,ఇంటింటికి వెళ్లి ఇవ్వండి లేదంటే అకౌంట్ కు బదలీ చేయండి-ఈ.సీ

=అమరావతి: రాష్ట్రంలో పించన్లు పంపిణీకి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి స్పష్టమైన ఆదేశాలు…

1 day ago

This website uses cookies.