అమరావతి: పెళ్లి చేసుకుంటానని నమ్మించి,,మహిళతో శృంగారంలో పాల్గొంటే ఆ సదరు చర్యను రేప్గా పరిగణించలేమని వ్యాఖ్యానించలేమని ఒడిశా హైకోర్టు జస్టిస్ ఎస్కే పాణిగ్రాహి ఆధ్వర్యంలోని సింగిల్ జడ్జ్ బెంచ్ తీర్పు వెలువరించింది..ఒడిశాలోని నిమపాదకు చెందిన ఒక మహిళను ఒక వ్యక్తి పెళ్లి చేసుకుంటానని నమ్మించి,,అతడు ఆమెను తీసుకుని, భువనేశ్వర్ వెళ్లాడు..ఇద్దరూ కొంతకాలంపాటు అక్కడే కలిసే ఉన్నారు..తనను పెళ్లి చేసుకుంటానని అతడు చెప్పడంతో, ఆమె అతడితో శృంగారంలో పాల్గొంది..కొద్ది రోజుల తరువాత అతడు,ఆమెను విడిచిపెట్టి వెళ్లిపోయాడు..దీంతో అతడిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేస్తూ, తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి, శారీరకంగా లొంగదీసుకున్నాడని, తర్వాత పెళ్లి చేసుకోకుండా వెళ్లిపోయాడని, అతడిపై అత్యాచారం కేసు నమోదు చేయాలని కోరింది..అమె ఫిర్యాదు మేరకు పోలీసులు అతడిని అరెస్టు చేశారు..ఈ అరెస్టును సవాలు చేస్తూ నిందితుడు,ఒడిశా హైకోర్టును ఆశ్రయించాడు..దీనిపై విచారణ జరిపిన కోర్టు తాజాగా నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది..‘‘పెళ్లి చేసుకుంటానని నమ్మించి, శృంగారంలో పాల్గొంటే దాన్ని అత్యాచారంగా పరిగణించలేం..అది పరస్పర అంగీకారంతో జరిగింది కాబట్టి, రేప్గా భావించలేం’’ అని చెబుతూ నిందితుడికి కోర్టు కండిషనల్ బెయిల్ మంజూరు చేసింది.
తిరుపతి: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో శుక్రవారం వైభవంగా సీతా జయంతి ఉత్సవం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో…
నెల్లూరు: రాష్ట్రంలో పోల్డ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లకు పటిష్టమైన భద్రత కల్పించాలని రాష్ట్రప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా…
హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు..ఈ పిటిషన్పై జస్టిస్…
రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…
అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…
అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…
This website uses cookies.