DEVOTIONAL

ఇరుకళల పరమేశ్వరి దేవస్థానం సమీపంలో స్వర్ణాల చెరువు ఘాట్ లో నిమజ్జనం-కాకాణి

నెల్లూరు: నగర వ్యాప్తంగా ఈనెల 31వ తేదీ నుంచి జరుపుకోనున్న వినాయక చవితి ఉత్సవాలను నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ప్రణాళిక బద్ధంగా నిర్వహించేందుకు ఏర్పాట్లను పూర్తి చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.గురువారం కార్పొరేషన్ కార్యాలయంలో గణేష్ చతుర్థి, నిమజ్జన ఏర్పాట్లపై ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు..మంత్రి మాట్లాడుతూ ప్రతీ ఏటా నిమజ్జనం నిర్వహించే పెన్నానది రంగనాయకుల పేట వద్ద కాకుండా ఈ ఏడాది ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం సమీపంలో స్వర్ణాల చెరువు ఘాట్ లో ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.. పండుగ నిర్వహణలో ఆసక్తి చూపే యువతకు ప్రోత్సాహంగా విగ్రహాల ఏర్పాటుకు పోలీస్ శాఖ అనుమతులు మంజూరు చేయాలని సూచించారు..ఇళ్ల మధ్యలో ఉండే మండపాల వద్ద భారీ సౌండ్లు, సాంస్కృతిక కార్యక్రమాలు లేకుండా సమీపంలోని బహిరంగ ప్రదేశాల్లో నిర్వహించుకునేలా అనుమతులు ఇవ్వాలని తెలిపారు.మండపాల వద్ద, నిమజ్జనం ప్రదేశంలో విద్యుత్ అంతరాయం లేకుండా ఆ శాఖ వారు జాగ్రత్తలు వహించాలని మంత్రి సూచించారు. ఘాట్ రిపేరు పనులు, చెరువులో గుర్రపు డెక్క ఆకు తొలగింపు, రోడ్డు మార్గాల నిర్మాణం వంటి అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. నిమజ్జనానికి 4 భారీ క్రేన్ లను వినియోగించాలని, రేపటి నుంచే నిమజ్జన ట్రయల్ రన్ పనులు ప్రారంభించాలని సూచించారు. వినాయక ఉత్సవాల నిర్వహణకు నుడా, మంత్రి, ఎమ్మెల్యే, ఎంపీ నిధులను వినియోగించనున్నామని, అదేవిధంగా జిల్లా కలెక్టర్ కూడా నిధులు మంజూరు చేసేలా కోరుతామని తెలిపారు. నిమజ్జనం జరిగే రోజుల్లో స్వర్ణాల చెరువులో తగినంత నీటిని నిల్వ ఉంచేలా నీటి పారుదల శాఖ అధికారులు జాగ్రత్తలు వహించాలని మంత్రి ఆదేశించారు.

Spread the love
venkat seelam

Recent Posts

ఎన్నికలు సజావుగా జరగేందుకు జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా వ్యవహరించాలి-మిశ్రా

సిటీ నియోజకవర్గం నుంచి 15 మంది.. నెల్లూరు: ఎన్నికలు శాంతియుతంగా సజావుగా జరగటానికి జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా వ్యవహరించాలని ప్రత్యేక…

5 hours ago

నియంత్రణ కోల్పోయిన అమిత్ షా ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌

అమరావతి: కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ టేకాఫ్‌ సమయంలో కొన్ని సెంకడ్ల పాటు నియంత్రణ…

6 hours ago

వాటర్ ప్యాకెట్లపై తయారీ, ఎక్స్ పెయిరీ తేదీలు లేకపోతే క్రిమినల్ కేసులే-MHO వెంకట రమణ

నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని అన్ని డివిజనుల్లో ఉన్న వాటర్ ప్లాంట్లలో తాగునీటి శుద్ధి, వాటర్ ప్యాకెట్లు, వాటర్…

10 hours ago

అవ‌స‌ర‌మైనంత కాలం రిజ‌ర్వేష‌న్లు కొన‌సాగించాల్సిందే- మోహన్ భగవత్

అమరావతి: రాష్ట్రీయ స్వయం సేవక్ చీఫ్ మోహన్ భగవత్ రిజర్వేషన్స్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.ఆదివారం ఒక విద్యాసంస్థలో ప్రసంగిస్తూ…

1 day ago

కేంద్ర ఎన్నికల పరిశీలకుల సమక్షంలో రెండో విడత మ్యాన్ పవర్ మేనేజ్మెంట్ ర్యాండమైజేషన్

నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల ప్రక్రియలో భాగంగా జిల్లాలో పోలింగ్ విధులకు పోలింగ్ సిబ్బందిని ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. ఆదివారం…

1 day ago

యువ‌త భ‌విష్యత్తే  మన రాష్ట్ర భవిష్య‌త్‌- డాక్ట‌ర్ పొంగూరు.నారాయణ

44 డివిజ‌న్ ఎన్నిక‌ల ప్ర‌చారం.. నెల్లూరు: యువ‌త భ‌విష్య‌త్తే...రాష్ట్ర భ‌విష్య‌త్ అని...మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు ఆలోచ‌న అని మాజీ…

2 days ago

This website uses cookies.