నెల్లూరు: నగరపాలక సంస్థ పరిధిలోని అర్హులు అందరిని గుర్తించి, సంబంధిత ఫారంలను క్షుణ్ణంగా పరిశీలించి, ఓటరు జాబితాలో చేర్పించాలని కమిషనర్ వికాస్ మర్మత్ ఎన్నికల విభాగం సిబ్బందిని ఆదేశించారు. ఎన్నికల విభాగం అధికారులు, సూపర్వైజర్లు, ఎలక్షన్ అధికారులతో కార్పొరేషన్ లో సమీక్ష సమావేశం మంగళవారం నిర్వహించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ డిసెంబర్ నెల 9వ తేదీ వరకు కార్పొరేషన్ పరిధిలోని అన్ని సచివాలయాలలో అర్హులైన ఓటర్ల నుంచి ఫారంలను సేకరించాలని సూచించారు. లింగ నిష్పత్తి అంచనాలను సమం చేస్తూ ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, నాట్ ట్రేసబుల్, మ్యారీడ్ విమెన్ వివరాలను ప్రత్యేకంగా నమోదు చేయాలని సూచించారు. డబల్ ఎంట్రీలు లేకుండా ఓటర్ల జాబితాను ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలని ఎన్నికల సిబ్బందిని సూచించారు. ప్రత్యేక క్యాంపుల ద్వారా ఫారం 6 ద్వారా చేస్తున్న చేర్పులపై చర్యలను కమిషనర్ ఆడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్క దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి ఓటరు ముసాయిదా జాబితాలో మార్పు చేర్పులు చేపట్టాలని కమిషనర్ ఆదేశించారు. ఈ సమావేశంలో ఏ.ఈ.ఆర్.వో. లు దేవి కుమారి, నిర్మలానంద బాబా, శ్రీనివాసులు, దశయ్య,మాధవి, సూపర్వైజర్లు, అధికారులు పాల్గొన్నారు.
నెల్లూరు: నగర పాలక సంస్థ పరిధిలోని సమ్మర్ స్టోరేజ్ వద్ద ట్యాంకు క్లియర్ వాటర్ పంపింగ్ స్టేషన్ నుండి కొత్తూరుకు…
అమరావతి: సోమవారం వేకువజామున బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని గోపాల్ రెడ్డి ఫాం హౌస్ లో జరిగిన రేవ్ పార్టీలో…
నెల్లూరు: జిల్లాలోఎన్నికల తర్వాత రాజకీయ ఘర్షణలు, అల్లర్లు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లాకలెక్టర్ ఎం.హరినారాయణన్ రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు.మంగళవారం…
ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ పబ్లిక్ పరీక్షలు.. నెల్లూరు: జిల్లాలో 10వ తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ పరీక్షలను…
అమరావతి: దేశంలో నలుగురు ఐసిస్ ఉగ్రవాదులు పట్టుబడ్డారు. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభ్భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో CISF సెక్యూరీటి అధికారులు,…
అమరావతి: మే 13వ తేదిన ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల రోజు, అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనల బాధ్యులు అయిన…
This website uses cookies.