AMARAVATHIDISTRICTS

నగరపాలక సంస్థ పరిధిలోని అర్హులైన వారందరినీ ఓటర్లుగా చేర్చండి-కమిషనర్ వికాస్

నెల్లూరు: నగరపాలక సంస్థ పరిధిలోని అర్హులు అందరిని గుర్తించి, సంబంధిత ఫారంలను క్షుణ్ణంగా పరిశీలించి, ఓటరు జాబితాలో చేర్పించాలని కమిషనర్ వికాస్ మర్మత్ ఎన్నికల విభాగం సిబ్బందిని ఆదేశించారు. ఎన్నికల విభాగం అధికారులు, సూపర్వైజర్లు, ఎలక్షన్ అధికారులతో కార్పొరేషన్ లో సమీక్ష సమావేశం మంగళవారం నిర్వహించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ డిసెంబర్ నెల 9వ తేదీ వరకు కార్పొరేషన్ పరిధిలోని అన్ని సచివాలయాలలో అర్హులైన ఓటర్ల నుంచి ఫారంలను సేకరించాలని సూచించారు. లింగ నిష్పత్తి అంచనాలను సమం చేస్తూ ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, నాట్ ట్రేసబుల్, మ్యారీడ్ విమెన్ వివరాలను ప్రత్యేకంగా నమోదు చేయాలని సూచించారు. డబల్ ఎంట్రీలు లేకుండా ఓటర్ల జాబితాను ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలని ఎన్నికల సిబ్బందిని సూచించారు. ప్రత్యేక క్యాంపుల ద్వారా ఫారం 6 ద్వారా చేస్తున్న చేర్పులపై  చర్యలను కమిషనర్ ఆడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్క దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి ఓటరు ముసాయిదా జాబితాలో మార్పు చేర్పులు చేపట్టాలని కమిషనర్ ఆదేశించారు. ఈ సమావేశంలో ఏ.ఈ.ఆర్.వో. లు దేవి కుమారి, నిర్మలానంద బాబా, శ్రీనివాసులు, దశయ్య,మాధవి, సూపర్వైజర్లు,  అధికారులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *