AMARAVATHI

నూతన విద్యా విధానంతో అభివృద్ధి చెందిన భారతదేశంగా మారుతుంది-సంజయ్ కుమార్

నెల్లూరు: జాతీయ విద్యా విధానం-2020 భారతీయ సమాజానికి డీఎన్ఏ లాంటిదని భారత ప్రభుత్వ పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి సంజయ్ కుమార్ అన్నారు..ఆదివారం నగరంలోని కస్తూర్భ కళాక్షేత్రంలో రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో పాఠశాల విద్య కోసం జాతీయ పాఠ్య ప్రణాళిక చట్రంపై రెండు రోజుల జాతీయస్థాయి విద్యా సదస్సు నిర్వహించారు.. ఈ సందర్భంగా సంజయ్ కుమార్ సదస్సునుద్దేశించి మాట్లాడుతూ వివిధ రకాల భాషలు, విభిన్న సంస్కృతల కలబోత అయినటువంటి భారతదేశ సమగ్రత, ఔన్నత్యం ఎంతో గొప్పదన్నారు.. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విద్యా విధానంతో రాబోయే 25 సంవత్సరాల్లో అభివృద్ధి చెందిన భారతదేశంగా అవతరించడానికి చోదకశక్తి గా పనిచేస్తుందన్నారు.. దేశంలో ఒకటో తరగతిలో చేరే ప్రతి వంద మంది పిల్లలకు కేవలం 75 మంది మాత్రమే 10 వ తరగతికి  చేరుతున్నారని, 56 మంది మాత్రమే 12 వ తరగతికి చేరుతున్నారన్నారు. ఇటువంటి డ్రాప్ అవుట్ ను అధిగమించి 2030 నాటికి 100% లక్ష్యం సాధించే విధంగా అందరూ కృషి చేయాలన్నారు. విద్యార్థుల్లో రైటింగ్ స్కిల్స్ పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు.

 జాతీయ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ (NCERT) డైరెక్టర్ దినేష్ ప్రసాద్ సక్లాని మాట్లాడుతూ ప్రాంతీయ విద్యా సంస్థ కేంద్రం నెల్లూరులో ఏర్పాటు చేసిన తరుణంలో చారిత్రక విద్యా సదస్సుకు నెల్లూరు వేదిక అవడం సంతోషకరమన్నారు.. విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంచే విధంగా, విశ్వవ్యాప్తంగా రాణించేందుకు పాఠశాల దశలోనే సామర్ధ్య నిర్మాణo రూపొందించడం వంటి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. విద్యార్థి సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పాఠ్యపుస్తకాలు తయారు చేస్తున్నామన్నారు.

Spread the love
venkat seelam

Recent Posts

ఇంటి స్థలం కొనుగొలుపై హైకోర్టుకు జూనియర్ ఎన్టీఆర్‌

హైదరాబాద్: జూనియర్ ఎన్టీఆర్‌ ఇంటి స్థలం కొనుగొలుకు సంబంధించిన వివాదాంపై తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు..ఈ పిటిషన్‌పై జస్టిస్‌…

1 hour ago

ముగ్గురు ఎస్పీలు,కలెక్టర్,12 మంది అధికారులపై తీవ్రంగా స్పందించిన-కేంద్ర ఎన్నికల సంఘం

రెండు రోజుల్లో నివేదిక ఇవ్వండి.. అమరావతి: ఎన్నికల అనంతరం జరిగిన గొడవలకు సంబంధించి పల్నాడుజిల్లా,, అనంతపురంజిల్లా ఎస్పీలను కేంద్ర ఎన్నికల…

18 hours ago

రేపు పలు జిల్లాలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం-కూర్మనాథ్

అమరావతి: ఉపరితల ద్రోణి ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు,తిరుపతి…

21 hours ago

స్ట్రాంగ్ రూమ్ ల వద్ద పటిష్టం భద్రత,కౌంటింగ్ డే రోజున పటిష్ట చర్యలు తీసుకొండి-సీఈసీ

అమరావతి: కేంద్ర ఎన్నికల సంఘంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి,, డీజీపీ హరీశ్ గుప్తా సమావేశం ముగిసింది..దాదాపు 55…

22 hours ago

అక్రమ ఇసుక తవ్వకాలపై తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు

రూ.10 వేల కోట్ల మేరకు అక్రమ ఇసుక రవాణా.. అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా యథేచ్చగా…

23 hours ago

పాక్ అక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటాం-అమిత్ షా

అమరావతి: సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న సమయంలో పాక్ అక్రమిత కశ్మీర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు..బుధవారం…

2 days ago

This website uses cookies.